ఫార్ములా ఈ కార్ రేస్ ఉచ్చు బిగుస్తోంది
అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు;
ఫార్ములా ఈ కార్ రేసు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, ఎ 1 నిందితుడు కెటీఆర్ ఇటీవలె ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఎసిబి నోటీసులు జారి చేసింది. కెటిఆర్ ఇటీవలె విచారణకు హాజరైన తర్వాతే అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెటీఆర్ ఇచ్చిన సమాధానాల నేపథ్యంలోనే అరవింద్ కుమార్ కు నోటీసులు వెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతం కుమార్తె కన్వోకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 30న తిరిగి హైద్రాబాద్ రానున్నారు. ఏసీబీ నోటీసులు అందుకున్న తర్వాతే అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ ఎ2 నిందితుడు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ లో ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాలో పని చేస్తున్న సమయంలోనే ఫార్ములా ఈ కార్ రేసు ఈవెంట్ జరిగింది. క్యాబినెట్ అనుమతించనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే అరవింద్ కుమార్ విదేశీ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించి కెటీఆర్ ఫోన్ లో ఇచ్చిన ఆదేశం మేరకే నిధులు మళ్లించినట్లు స్వయంగా అరవింద్ కుమార్ అంగీకరించారు. ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండా నిధులు బదలాయించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.ఏసీబీ విచారణకు ఆదేశించింది.ఈ కేసులో కెటిఆర్ గత జనవరిలోనే ఏసీబీ విచారణకు , ఆ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఐదునెలల గ్యాప్ తర్వాత కెటీఆర్ ఈ నెల 16న మూడోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు తదితర వివరాలు కెటీఆర్కిఏసీబీ అందించారు. ఈ వివరాలను రాబట్టిన ఏసీబీమరో మారు కెటీఆర్ , అరవింద్ కుమార్ ల ను కలిసి విచారించే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ వచ్చే నెల (జులై 1)వతేదీన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది