ఐదు రోజుల కస్టడీకి నూనె శ్రీధర్

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర;

Update: 2025-06-20 14:34 GMT

ఐదు రోజుల నిమిత్తం కరీంనగర్ జిల్లా చొప్ప దండి డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెంచల్ గూడ జైలులో నూనె శ్రీధర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎసిబి అధికారులు ఎసిబి కోర్టును కోరారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తూ కోట్లాది రూపాయలు కూడబెట్టిన నూనె శ్రీధర్ పై ఎసిబి దాడులు చేసింది. లెక్కకు మించిన సంపద ఉండటంతో నూనె శ్రీధర్ పట్టుబడ్డారు.

దేశంలో ప్రసిద్దిగాంచిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మితమైంది. ఇంత భారీ ప్రాజెక్టులో నూనె శ్రీధర్ ముఖ్యభూమిక వహించారు. నూనె శ్రీధర్ వద్ద 150 కోట్ల అక్రమ సంపాదన బయటపడింది.

Similar News