కవిత ‘ఆఫ్ ది రికార్డ్’ రాజకీయం
కవిత మీడియా ముందు రెండురకాలుగా వ్యవహరిస్తున్నారు;
గడచిన పదిరోజులుగా టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయిన కల్వకుంట్ల కవిత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కవిత మీడియా ముందు రెండురకాలుగా వ్యవహరిస్తున్నారు. అధికారికంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నపుడు అచ్చంగా తెలంగాణ సమస్యలు, జాగృతిసంస్ధ గురించి, కేసీఆర్ నాయకత్వంగురించి పాజిటివ్ ప్రకటనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదే ‘ఆఫ్ ది రికార్డు’గా మాట్లాడుతున్నపుడు పై విషయాలకు భిన్నంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, సోదరుడు కేటీఆర్(KTR) పేరెత్తకుండా ఆరోపణలు, విమర్శలు, కేసీఆర్(KCR) వైఖరిలో లోపాలు, పార్టీలో సమస్యలు, బీజేపీతో విలీన చర్చల్లాంటి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు.
ఆఫ్ ది రికార్డుగా కవిత పార్టీకి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి అవేవీ కవిత పేరుమీద మీడియాలో రావటంలేదు. కవిత పేరుమీద మీడియాలో కనబడటంలేదు కాబట్టి ప్రత్యర్ధులు ఆమె వ్యాఖ్యలపై ప్రత్యారోపణలు చేయలేకపోతున్నారు. ఈ పాయింట్ మీదే పార్టీ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అనుకున్నా తీసుకోలేకపోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పైగా ఆమె స్వయాన అధినేత కూతురు కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలంటే ఒక సమస్య, చర్యలు తీసుకోకుండా వదిలేస్తే మరో సమస్యగా మారుతోంది. కవిత మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని నేతలెవరూ కేసీఆర్ ను అడిగేంత సీన్ లేదు కాబట్టి ఎవరికి వారుగా ఆమె వైఖరిని గమనిస్తు కామ్ గా ఉండిపోతున్నారు. మహాయితే అంతర్గతంగా చర్చించుకుంటున్నారే కాని ధైర్యంగా ఆమెపై యాక్షన్ తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేయలేకపోతున్నారు.
ఇదేవిషయమై బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందనరావు(BJP MP Raghunandan Rao) మీడియాతో మాట్లాడుతు కవిత ఆఫ్ ది రికార్డు, చిట్ చాట్ పేరుతో మాట్లాడటటాన్ని తప్పుపట్టారు. పార్టీఅంతర్గత విషయాలు, కేటీఆర్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, బీజేపీతో విలీనంచర్యల్లాంటి అనేక అంశాలను కవిత అధికారికంగా మీడియా సమావేశాల్లో ఎందుకు మాట్లాటంలేదని నిలదీశారు. కొన్ని అంశాలను మీడియా సమావేశాల్లో, ఆఫ్ ది రికార్డ్..చిట్ చాట్ పేరుతో మరికొన్ని అంశాలను మాట్లాడటం ఏమిటని కవితను ప్రశ్నించారు. ధైర్యం ఉంటే అన్నీ విషయాలను అధికారికంగానే మీడియాతో మాట్లాడాలని సవాలు కూడా విసిరారు.
దీంతోనే కవిత ఆఫ్ ది రికార్డ్ రాజకీయంతో బాగా అడ్వాంటేజ్ తీసుకుని రెచ్చిపోతున్నారు. విదేశీ ప్రయాణం నుండి తిరిగొచ్చిన తర్వాత కేటీఆరే స్వయంగా సోదరి వ్యవహారాన్ని తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళే అవకాశాలున్నాయని పార్టీ నేతల మధ్య టాక్ నడుస్తోంది. అమెరికా నుండి హైదరాబాదుకు తిరిగొచ్చిన తర్వాత ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతు కేసీఆర్ కు రాసిన లేఖ తానే రాసానని బహిరంగంగా కమిట్ అయ్యారు. అంతకుమించి పార్టీ అంతర్గత సమస్యలు, వ్యవహారాలు, కుటుంబ వివాదాలు, సోదరుడితో విభేదాలు, బీజేపీతో విలీనంచర్చల్లో ఏవికూడా అధికారికంగా మీడియాతో మాట్లాడలేదు. ఇక్కడే కవిత వ్యూహం పార్టీనాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది.
ఇదేవిషయమై పార్టీసీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతు పార్టీనాయకత్వానికి వ్యతిరేకంగా కవిత ఏమీ మాట్లాడలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పార్టీకి లేదా నాయకత్వానికి వ్యతిరేకంగా కవిత ఏమన్నా మాట్లాడితే కదా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఆలోచించాలన్నారు. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలగురించి కవిత లేఖలో ప్రస్తావించిన అంశాల్లో తప్పేముందని మీడియానే వినోద్ ఎదురు ప్రశ్నించారు. సో, జరుగుతున్నది గమనించిన తర్వాత ఆప్ ది రికార్డు పేరుత కవిత రాజకీయానికి అందరు ఆశ్చర్యపోతున్నారు.