జూబ్లిహిల్స్ న్యాయవిహార్ పేలుళ్లపై విచారణ 16కి వాయిదా
పేలుళ్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన సీజే;
జూబ్లీహిల్స్లోని న్యాయవిహార్ సమీపంలో పేలుళ్లపై దాఖలైన పిల్ పై ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరిగింది.
ఇళ్ల నిర్మాణంలో భాగంగా భారీ పేలుళుడు పదార్థాలు వినియోగిస్తున్నారని సీజే ధర్మాసనానికి ఓ న్యాయమూర్తి లేఖ రాశారు. ఆ లేఖను ధర్మాసనం గతేడాది సెప్టెంబర్లో స్వీకరించి విచారణ ప్రారంభించింది. భారీ పేలుళ్లతో రాత్రివేళ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు. పేలుళ్లకు ఎవరు అనుమతి ఇచ్చారని తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.
సిటీ పోలీస్ యాక్ట్ కింద అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారని.. నగరంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిష్ నర్ ఆరోపించారు. పోలీసుల అనుమతితో పేలుళ్లు నిర్వహించారని గనులశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్లాస్టింగ్ తీవ్రత, రాళ్లు ఎంతదూరం పడతాయనే అంశాలపై పోలీసులకు అవగాహన ఉంటుందా అని సీజే ప్రశ్నించారు. పేలుళ్ల అనుమతులకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు ఉండాలని జస్టిస్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు.
గుట్టలను యథేచ్ఛగా తొలగించడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు బ్లాస్టింగ్కు అనుమతి ఉందని ఏఏజీ ఇమ్రాన్ఖాన్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన సమయం కోరారు. వాదోపవాదాల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 16 తేదీకి కి వాయిదా వేసింది.