విచారణకు హాజరైన కేసీఆర్..

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. కొన్ని ఫైల్స్ పట్టుకుని వచ్చారు.;

Update: 2025-06-11 06:04 GMT

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్‌లో ఆయనను పీసీ ఘోష్ విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు కేసీఆర్‌తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది.

ఫైల్‌తో కేసీఆర్..

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. కొన్ని ఫైల్స్ పట్టుకుని వచ్చారు. అవి ఆయన రూపొందించిన నివేదికలే అని తెలుస్తోంది. వాటిని కమిషన్‌కు సమర్పించనున్నట్లు సమాచారం. అదే విధంగా కమిషన్ అనుమతిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కేసీఆర్ రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Tags:    

Similar News