కవిత అంటే కేసీఆర్లో ఇంత కోపముందా ? (వీడియో)

అందరు నేతల్లాగే కవిత(Kavitha) తన భర్త అనీల్ తో కలిసి ఫామ్ హౌస్ చేరుకున్నారు.;

Update: 2025-06-11 07:38 GMT
KCR in his farm house

కూతురు కల్వకుంట్ల కవిత కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాగా డిస్ట్రబ్ అయినట్లున్నారు. అందుకనే కవితకు ఫామ్ హౌస్ లోకి నో ఎంట్రి బోర్డు పెట్టేశారు. ఇపుడు విషయం ఏమిటంటే బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. అధినేతను కలుసుకునేందుకు పార్టీలోని కీలకనేతలంతా ఫామ్ హౌస్ కు ఉదయమే చేరుకున్నారు. అందరు నేతల్లాగే కవిత(Kavitha) తన భర్త అనీల్ తో కలిసి ఫామ్ హౌస్ చేరుకున్నారు. మిగిలిన అందరిలాగే ఆమె హాలులో వెయిట్ చేశారు. సుమారు 10 గంటలకు కేసీఆర్(KCR) పై అంతస్తునుండి హాలులోకి లిఫ్ట్ ద్వార దిగొచ్చారు.

లిఫ్ట్ లో నుండి కేసీఆర్ బయటకు వచ్చేటప్పుడు కవిత లిఫ్ట్ కు కుడివైపు వున్న మెట్ల దగ్గరే నిలబడుతున్నారు. కింద హాలులో తనకోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారన్న సమాచారం అధినేతకు ఉంది. అయితే లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా కనబడిన నేతలను పలకరించారు. ఒక నేత కేసీఆర్ చేతికి రక్షాబంధన్ కట్టారు. వెనుకనే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ నిలబడ్డారు. ఎదురుగా ఉన్న నేతలను పలకరించి మాట్లాడుతునే కేసీఆర్ హలులో నుండి బయటకు వచ్చేసి కారు ఎక్కి కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. రక్షాబంధన్ కట్టించుకున్నారు, ఎదురుగా కనిపించిన నేతలతో మాట్లాడారు కాని పక్కనే మెట్ల దగ్గర నిలబడున్న కూతురు వైపు కేసీఆర్ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. లిఫ్ట్ లో నుండి కేసీఆర్ బయటకు వచ్చినపుడు కవిత కూడా ఎదురుపడలేదు. మెట్ల దగ్గర వెనకే దూరంగా ఉండిపోయారు.

తాజా ఘటనతో కూతురు కవిత అంటే కేసీఆర్ ఎంతగా మండిపోతున్నారో అర్ధమవుతోంది. అందుకనే గడచిన 15 రోజులుగా కవితకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ దొరకటంలేదు. తనను చూడటానికి, మాట్లాడటానికి కేసీఆర్ ఇష్టపడటంలేదన్న విషయం కవితకు కూడా బాగా అర్ధమైంది. తండ్రి పిలిస్తే ఫామ్ హౌస్ కు వెళదామని కవిత ఎదురుచూస్తున్నారు. అయితే కవితను పిలిపించి మాట్లాడే ఉద్దేశ్యంలో లేని కేసీఆర్ రమ్మని కబురుచేయలేదు.

ఇద్దరి మధ్యా సమస్య ఏమిటి ?

కేసీఆర్ ను ఉద్దేశించి కవిత రాసిన లేఖ ఆమె అమెరికాలో ఉండగా లీకైన విషయం తెలిసిందే. కేసీఆర్ ను ఉద్దేశించిన లేఖలో తండ్రి వైఖరిని కొన్ని అంశాల్లో ఆమె తప్పుపట్టారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో బహిరంగసభ జరిగింది. సభనిర్వహణలో లోపాలను ఎత్తిచూపిన కవిత కొన్నిఅంశాల్లో అభినందించారు. హోలు మొత్తంమీద పార్టీలోని లోపాలను లేఖలో ఎత్తిచూపటం సంచలనమైంది. లేఖలోని అంశాల్లో ఎక్కువగా పేరు ప్రస్తావించకుండా అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లుగా అందరికీ అర్ధమైపోయింది. తర్వాత మీడియాతో మాట్లాడుతు కేసీఆర్ దేవుడని అంటూనే పార్టీలో కోవర్టులున్నారని, కేసీఆర్ చూట్టూతా దయ్యాలున్నట్లు తీవ్రంగా ఆరోపించారు. తండ్రికి తాను రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో తెలియాలని పదేపదే డిమాండ్ చేశారు. కవిత లేఖ లీకవ్వటంతో కేసీఆర్ ఫ్యామిలీలోని విభేదాలన్నీ రోడ్డునపడినట్లయ్యింది.

ఇలాంటి అనేక కారణాలతో తండ్రి, అన్నతో కవితకు బాగా గ్యాప్ వచ్చేసింది. అప్పటినుండి పార్టీకి దూరంగా జాగృతి సంస్ధ ద్వారా కవిత సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. మానసికంగా పార్టీకి కవిత దూరమైపోయ్యారన్న సంకేతాలు కనబడుతున్నాయి. తండ్రి తనను పిలిపించి మాట్లాడాలని కవిత అనుకున్నా సాధ్యంకాలేదు. ఎందుకంటే కేటీఆర్(KTR) పై కవిత ఆరోపణలుచేయటాన్ని, విమర్శించటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయరు. అంతేకాకుండా పార్టీ పరువును కూతురు బజారున పడేశారన్న తీవ్ర ఆగ్రహంతో కేసీఆర్ ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇలాంటి అనేక కారణాలతో కవితను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడేందుకు కేసీఆర్ ఇష్టపడటంలేదు. అందుకనే కవితకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ దొరకలేదు.

బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణ సాకుతో మిగిలిన నేతల్లాగే కవిత కూడా ఫామ్ హౌస్ లోకి వెళ్ళారు. ఎదురుపడిన నేతలను పలకరించిన కేసీఆర్ లిఫ్ట్ పక్కనే మెట్లదగ్గర నిలబడున్న కవితను మాత్రం పట్టించుకోలేదు. దాంతోనే కూతురిపై కేసీఆర్లో ఎంతటి మంటుందో అర్ధమైపోతోంది. కేసీఆర్ కారు ఎక్కి బయటకు వెళ్ళిపోగానే మిగిలిన నేతలతో పాటు కవిత కూడా బయటకు వచ్చేశారు.

Tags:    

Similar News