సెల్‌పోన్ల అప్పగింతపై ఏసీబీకి కేటీఆర్ లేఖ

Update: 2025-06-18 14:57 GMT

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు ఫార్ములా కార్ రేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా రేస్ జరిగిన సమయంలో వాడిన సెల్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను అధికారులకు హ్యాండోవర్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. ఇందుకోసం కేటీఆర్‌కు 48 గంటల సమయంలో కూడా ఇచ్చారు. ఈ సమయంలో బుధవారంతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్.. న్యాయనిపుణులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఏసీబీ అధికారులు తన ఫోన్, ల్యాప్‌టాప్ అడగొచ్చా అన్న అంశంపై చర్చించారు. కాగా తాజాగా ఈ అంశంపై ఏసీబీ అధికారులకు అధికారిక లేఖ ఒకటి రాశారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. అయితే న్యాయనిపుణులతో భేటీ తర్వాతనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News