రాయచెరువులో మహావీరుని శిల్పం
"బెజగాంలో కొత్త జైన తీర్థంకర శిల్పాల గుర్తింపు";
సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలంలో చారిత్రక గ్రామం బెజుగామ ఈ గ్రామంలో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని శిల్పాలు, రెండింటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించాడు. ఇందులో మొదటి శిల్పం రాయ చెరువులో ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న ఈ మహావీరునీ తలపై ఉష్ణీషం చెక్కి ఉంది, ఇలా చెక్కి ఉండడం అరుదైన విషయం, కోలముఖంతో, కనిపిస్తున్న ఈ శిల్పం 8,9వ శతాబ్దాలకు చెందిన శైలిలో బ్లాక్ కోరైట్ రాయి మీద చెక్కబడింది. రెండవది గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కన చెత్తలో కూరుకుపోయి విరిగి కనిపిస్తుంది. ఈ శిల్పం గుండ్రని ముఖంతో, చిన్న ఉష్ణీషంతో 10,11వ శతాబ్దాలకు చెందిన శైలిలో చెక్కబడింది. బెజగాంలో 11వ శతాబ్దానికి (1072కు) చెందిన కళ్యాణీ చాళుక్య పాలకుడు భువనైకమల్ల దేవర కాలంలో పంప పెర్మానడిగల్ బెజగాం దేవునికి చేసిన దాన శాసనం ఒకటి, అదే కాలానికి చెందిన మరొక శాసన శకలం ఉన్నాయి. ఆ శాసనంలో పేర్కొన్న బెజగాం దేవుడు జైనతీర్థంకరుడే అయ్యుండొచ్చు. చెరువులో ఉన్న శిల్పం నీటిలో మునిగిపోక ముందే కట్టమీదకు చేర్చి గ్రామస్తులు వారి గ్రామ చరిత్రను కాపాడుకోవాలి అని పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.