జీడిమెట్లలో నకిలీ మావోలు అరెస్ట్..

నిందితులు 13 దేశీయ బాంబులు, నాలుగు మొబైల్ ఫోన్లు, బెదిరింపు లేఖతో పట్టుబడ్డారు.;

Update: 2025-05-28 17:25 GMT

విజయనగరంలో మావోయిస్ట్‌లమని చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు అద్దెకు ఉంటున్న యజమానికే మావోయిస్ట్‌ల పేరుతో లేఖ రాసి బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని నకిలీ మావోయిస్ట్‌లుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ నరేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుండి షాపూర్ నగర్లో తాత్కాలికంగా నివసిస్తున్న ఎర్రంశెట్టి రాజు (33), కందురెల్లి రాజు (24)గా గుర్తించబడిన నిందితులు 13 దేశీయ బాంబులు, నాలుగు మొబైల్ ఫోన్లు, బెదిరింపు లేఖతో పట్టుబడ్డారు.

‘‘మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుమారుడు రవీందర్ గౌడ్ ఇంట్లో ఇద్దరు నిందితులు ఉంటున్నారు. రవీందర్ గౌడ్ ఆర్థిక లావాదేవీలు తెలుసుకుని అతన్ని బెదిరిస్తే డబ్బులు వస్తాయని నిందితుడు భావించాడు. పథకం ప్రకారమే స్నేహితుడి సహాయంలో మావోయిస్ట్‌ల పేరుతో బెదిరించి డబ్బు సంపాదించాలకున్నారు. దాంతోనే బాధితుడికి మావోయిస్టుల పేరుతో లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. మొఖానికి మాస్క్ వేసుకుని ప్రధాన నిందితుడు రాజు.. రవీందర్ గౌడ్ ఇంటి ముందు ఉన్న కారుపై ఎర్ర రంగు టవల్‌లో పెట్టాడు. ఆ తర్వాత బాధితుడికి ఎర్రంశెట్టి రాజు ఫోన్ చేసి బెదిరించాడు. నిందితుల పథకం ప్రకారమే అనుకున్నవన్నీ సజావుగా జరిగాయి. పోలీసుల దర్యాప్తు చేస్తున్న సంగతి నిందితులకు తెలవకపోవడంతో మళ్లీ తిరిగి బాధితుడి ఇంట్లో బాంబులు అమర్చి భయబ్రాంతులకు గురి చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో బండారం బయటపడింది’’ అని చెప్పారు.

‘‘నిందితులను గుర్తించడం కోసం దాదాపు 500కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించాం. ఈ క్రమంలోనే విజయనగరం వెళ్లి నాటు బాంబులు కూడా కొనుగోలు చేసినట్లు గుర్తించాం. వెంటనే నిందితులను అరెస్ట్ చేశాం. వారి దగ్గర నుంచి 13 నాటు బాంబులు, నాలుగు సెల్‌ఫోన్లు, బెదిరింపు లేఖను స్వాధీనం చేసుకున్నాం’’ అని నరేష్ ప్రకటించారు. 

Tags:    

Similar News