సిట్ విచారణకు హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో..;
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయదుందుభి మ్రోగించి అధికారంలో వచ్చింది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిలో ప్రతి పక్ష నేతలు కూడా ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించి విచారించారు. మరో నిందితుడు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావులను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ సమాచారాన్ని సిట్ అపడేట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఒక్కొక్కరిని విచారించడం ప్రారంభించింది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
వీరిలో బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుల స్టేట్ మెంట్ రికార్డు చేసిన సిట్ 250 మంది బాధితుల పేర్లను రికార్డు చేసింది. వీరిలో 200 కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు. 4, 200 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ అయిన వారిలో మాజీ గవర్నర్ తమిళసై పేరు కూడా వినిపిస్తుంది. హైకోర్టు జడ్జిలు,జర్నలిస్ట్ లు, సినిమా, ఫార్మా, ఐటి రంగాలకు చెందిన వారు ఉన్నారు.
గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ , బిఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం పెద్గఎత్తున జరిగింది . కెసీఆర్ ప్రభుత్వం బిజెపి ఎంపీలను కూడా వదల్లేదు. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా వీరిలో ఉన్నారు. శుక్రవారం ఆయనను సిట్ విచారణకు పిలిచింది. సిట్ విచారణ జరుగుతున్న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. సిట్ అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.