టిప్పర్ క్రింద పడి బాలుడు మృతి

పుత్రశోకం మిగిల్చిన మల్లంపేట ప్రమాదం;

Update: 2025-06-27 09:18 GMT

పుత్ర శోకం బాధ అంతా కాదు. తల్లిదండ్రుల వేధన భరించలేనిదిగా ఉంటుంది. కళ్ల ముందే తనకొడుకు రోడ్డుప్రమాదంలో మరణించడం అక్కడున్నవారిని కలచి వేసింది. కొడుకును స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ఆ తల్లి డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెనక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ స్కూటీని బలంగా ఢీ కొట్టింది. టిప్పర్ ఢీ కొట్టగానే స్కూటీ అదుపు తప్పి పడిపోయింది. స్కూటీ పై ప్రయాణిస్తున్న తల్లి కొడుకులు క్రిందపడి పోయారు. బాలుడు టిప్పర్ చక్రాల క్రిందపడిపోయాడు. టిప్పర్ చక్రాల క్రింద బాలుడు నలిగిపోయాడు. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు.

ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు పరిస్తే రోడ్డు ప్రమాదాలను మాగ్జిమమ్ నివారించవచ్చు. కొడుకు ను స్కూటీపై కూర్చోపెట్టుకున్న ఆ మహిళ ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ఫోర్ వీలర్స్ లేన్లో ఎంటర్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్కూటీ పై ప్రయాణిస్తున్న మహిళ హెల్మెట్ ధరించలేదు. పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు చెప్పే ముందు తల్లి దండ్రులే ఆ నియమాలను పాటించాల్సి ఉంటుంది. కొడుకు స్పాట్ లోనే చనిపోవడంతో ఆ తల్లి లబోదిబోమంది.

Tags:    

Similar News