సీఎం రేవంత్పై పరువునష్టం దావాలో కీలక పరిణామం..
విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరువునష్టం కేసులో భారీ ఊరట లభించింది. టీబీజేపీ దాఖలు చసిన పరువునష్టం దావాను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. టీబీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణకు నిరాకరించింది. పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
2024 లోక్సభ ఎన్నికలప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన మాటలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేరకు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 125 కింద కేసు కొనసాగుతుందని కోర్టు తెలిపింది. దీంతో రేవంత్.. హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువునష్టంగా పరిగణించలేమంటూ హైకోర్టు తెలిపింది. కాగా ఉన్నతన్యాయస్థానం తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కొట్టివేసింది. అంతేకాదు, కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని పిటిషనర్ అయిన బీజేపీ నేతపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.