కుమ్ములాటలతో అమ్మవారికి బోనాలు లేకుండా చేశారు..

ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తారేమోనన్న అనుమానాలున్నాయి. అందుకే బోనాలను తాత్కాలికంగా నిలిపేశాం.;

Update: 2025-06-21 14:08 GMT

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోయి.. చివరికి వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు కూడా లేకుండా చేశారు. కొన్ని రోజులుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర వైరం కొనసాగుతోంది. ఆలయంపై ఆధిపత్యం కోసం వీరు రెండు వర్గాలు మారారు. ఇప్పుడు ఆ ఆలయంలో జరిగే బోనాల విషయంలో తమది పైచేయి ఉండాలని, తమ ఆధ్వర్యంలోనే అంతా జరగాలని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో వీరి మధ్య వైరం కాస్తా చిలికి చిలికి గాలివానగా అయినట్లు అధికం అయింది. ఈ నేపథ్యంలోనే బోనాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని సర్కార్ డిసైడ్ అయిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొందరు రాజకీయ వైషమ్యాలను పవిత్ర కార్యానికి ముడిపెట్టి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాల అంశం కీలకంగా మారింది. ఈ విషయంలో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర వైరం నెలకొని ఉంది. అది మరింత అధికమైంది. ఇటీవల కొండా సురేఖకు వ్యతిరేకంగా, వరంగల్ బోనాల అంశంపై చర్చించడానికి పలువురు నేతలు నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ అంశం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలోనే బోనాలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొందరు అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టించాలని చూస్తున్నారన్న అనుమానంతోనే బోనాలను వాయిదా వేశామని కొండా సురేఖ వెల్లడించారు.

‘‘ఆగమశాస్త్రం ప్రకారం, వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22న బోనాలు నిర్వహించాలని అనుకున్నాం. అయితే, మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు కొందరు చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. శాకాహార బోనాలే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం, స్థానిక ఈవో, వేదపండితులు పలుమార్లు పునరుద్ఘాటించారు. స్థానిక రాజకీయ వైషమ్యాలను కొందరు పవిత్ర కార్యానికి ముడిపెట్టి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తారేమోనన్న అనుమానాలున్నాయి. అందుకే బోనాలను తాత్కాలికంగా నిలిపేశాం. తగిన సమయంలో వైభవంగా నిర్వహిస్తాం’’ అని స్పష్టం చేశారు.

కుమ్ములాటలతో బోనాలు వాయిదా..

కొండా సురేఖ కుటుంబం, నాయిని రాజేందర్‌కు మధ్య ఆలయంపై ఆధిపత్యం విషయంలో ఉన్న వైరం వల్ల వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనం లేకుండా చేశారు. బోనాలు ఘనంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య వైరం అధికం అయింది. ఈ క్రమంలోనే బోనాల అంశంపై ఇరు వర్గాల మధ్య భారీ మాటల యుద్ధం జరిగింది. ఈ కుమ్ములాట వల్ల అమ్మవారి బోనాలు ఆలస్యం కానున్నాయి. వాస్తవానికి అమ్మవారికి జూన్ 22న బోనం నిర్వహించాలి. ఆగమశాస్త్రం, వేద పండితుల నిర్ణయం మేరకు ఈ ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ రాజకీయ కుమ్ములాటలతో ఇది వాయిదా పడింది.

Tags:    

Similar News