ఆరుంధతీ రాయ్ కి తెలుగు కవుల సంఘీభావం

ఆరుంధతీ రాయ్ కి సంఘీభావంగా వెలువడిన కవితా సంకలనం ఆవిష్కరణ

Update: 2024-07-30 13:33 GMT

ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ కి సంఘీభావంగా వెలవడిన 'మాటలే దేశద్రోహమైతే’ అనే  కవితా సంకలనాన్ని ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.  ఇదే విధంగా  ‘కలలు చిగురిస్తాయి’ పేరున  పాలస్తీనా పోరాాటానికి మద్దతుగా వెలువడిన మరొక కవితా సంకలనాన్ని కూడా ఆవిష్కరించారు. ఆరుంధతీ రాయ్ మీద విధిస్తున్న ఆంక్షలను నిరసిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛను కీర్తిస్తూ  పలువురు యువకవులు రాసిన కవితలు 'మాటలే దేశద్రోహమైతే’ సంకలనంలో  ఉన్నాయి.  మాతృభూమి కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా  ‘కలలు చిగురిస్తాయి’ వెలువడింది.

రచయిత  దొంతం చరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రొపెసర్. కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిఘటన పై మాట్లాడుతున్న యంగ్ జనరేషన్ రాయడం కూడా చాలా అవసరం అన్నారు. ‘యువకులు కవితలు రాయడం స్ఫూర్తి దాయకం ఇది ముందు జనరేషన్స్ కి మంచి వాయిస్ అవుతుంది,’ అని అన్నారు.

జర్నలిస్టు ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ‘పాలస్తీనా ప్రజలు ఇప్పుడు నేల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారు. సానుభూతి కాదు సంఘీభావం ముఖ్యం, పాలస్తీనా ప్రజల కన్నీళ్లను రోదనను కవిత్వంగా మలిచి ఈ యువత సంఘీభావంగా నిలిచింది,’ అన్నారు. అరుంధతి రాయ్ స్వేచ్ఛని హరించడం అన్యాయమని ఆయన అన్నారు. వాస్తవం చెప్పడానికి కవిత్వాన్ని మనం ఆయుధంగా వాడుకుందామని కవి యాకూబ్ పిలుపునిచ్చారు. మనుషుల్ని ప్రేమిద్దాం అని ఆయన అన్నారు.
ఎస్.ఎ.డేవిడ్ పాలస్తీనా పోరాట స్ఫూర్తిని యూనివర్సిటీల బాధ్యతను గుర్తు చేశారు. 22 మంది యువకవులు పాలస్తీనా మీద స్పందించడం, అరుంధతీ రాయ్ కి సంఘీభావంగా కవిత్వం రావడం ఈ పుస్తకాల ప్రత్యేకత అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత్రి సలీమ, లావణ్య, శ్రీనిధి, అనూష, రోజారాణి, సాత్విక, శ్రావణి, మహేష్, శివ, హాథిరామ్, బాలు, సాయి, వినోద్, లింగన్న వంటి కవులు, రచయితలు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News