బెంగాల్ సీఎం, ప్రధానికి అంత గట్టి సవాల్ ఎందుకు విసిరారు?
జాతీయవాదం వర్సెస్ ఉప జాతీయవాదంలో ఎవరిది పైచేయి;
By : The Federal
Update: 2025-05-31 08:09 GMT
ఆపరేషన్ సిందూర్ తరువాత బెంగాల్ లో పర్యటించిన ప్రధాని మోదీ, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పై విమర్శలు చేశారు. ‘దీదీ’ని ‘నిర్ మమత’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఈ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం ఎదురుదాడి చేశారు. ప్రధానికి ధైర్యం ఉంటే బహిరంగ టీవీ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. ఈ అంశంపై ‘ది ఫెడరల్’ లో నిర్వహించిన ‘కాపిటల్ బీట్’ ఎపిసోడ్ లో టీఎంసీ ప్రతినిధి శుభంకర్ భట్టాచార్య, సీనియర్ జర్నలిస్ట్ సమీర్ కే పుర్కాయస్థ పాల్గొన్నారు.
యాంకర్ నీలు వ్యాస్ ఈ చర్చను నిర్వహించారు. ఇందులో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు, జాతీయవాదం, అక్కడి పరిస్థితులపై విశ్లేషణ చేశారు.
ఆపరేషన్ బెంగాల్ ఎదురుదెబ్బ..
ఆపరేషన్ బెంగాల్ అమలులో ఉందని, ఇది టీఎంసీపై రాజకీయ, పరిపాలన చర్యలు మార్పు తీసుకువస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ ప్రజలకు అవమానం అని అభివర్ణించారు. ‘‘మోదీ బెంగాల్ మహిళలను అగౌరవపరిచారు’’ అని కూడా అన్నారు. ‘‘ మీ టెలి ప్రాంప్టర్ తీసుకురండి.. రేపు ఎన్నికలు నిర్వహించండి..మేము సిద్ధంగా ఉన్నాము’’ అని సవాల్ విసిరారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు, భాషను భట్టాచార్య ఖండించారు. ఇది బెంగాల్ ను శత్రుదేశాలతో సమానంగా చేస్తుందని అన్నారు. ‘‘మీరు బెంగాల్ ను పాకిస్తాన్ తో సమానంగా భావిస్తున్నారా? ’’ అని అన్నారు. ఎన్నికలకు ముందు జాతీయవాద భావనను రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా విశ్లేషించారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడుగా వ్యవహరించడం యాదృచ్చికం కాదని పుర్కాయస్థ వివరించారు. ‘‘దాడి చేసేటప్పుడూ ఆమె అత్యుత్తంగా వ్యవహరిస్తారు’’ అని పేర్కొన్నారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలు తిరిగి టీఎంసీకి లాభం చేకూర్చే అవకాశం కల్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికలను సెట్ చేయడానికే..
బీజేపీ ఆపరేషన్ బెంగాల్ గురించి ప్రస్తావించడాన్ని ఇద్దరు విశ్లేషకులు ఎన్నికల ఎజెండాను మార్చడానికి చేసిన ఉద్దేశపూర్వక వ్యూహంగా భావించారు. భట్టాచార్య ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ ద్వారా మోదీ బిహార్, బెంగాల్ ఎన్నికల బ్రాండింగ్ విలువను పరీక్షిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే సైనిక విజయాన్ని రాజకీయం చేయడం వల్ల ఎదురుదెబ్బ కూడా తగులుతుందని ఆయన హెచ్చరించారు. ‘‘పేరుతో సంబంధం లేకుండా భారత్ సైన్యం తన విధిని నిర్వర్తించింది.’’ అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ చారిత్రాత్మకంగా తన ఓటు బ్యాంకును ఏకం చేయడానికి జాతీయవాదం, మతం వంటి భావోద్వేగ అంశాలపై ఆధారపడిందని పుర్కాయస్థ అన్నారు. అయితే ‘‘ఈ సారి ఆపరేషన్ సిందూర్ కు ప్రజల స్పందన పుల్వామా అంతలా లేదు’’ అని ఆయన ఎత్తి చూపారు.
ఉపజాతీయవాదం వర్సెస్ జాతీయవాదం
మోదీ జాతీయవాదం, మమత బెంగాలీ ఉప జాతీయవాదం మధ్య ఘర్షణ ఈ చర్చలో కీలక అంశంగా నిలిచింది. బీజేపీ జాతీయవాద ప్రయత్నాలు టీఎంసీ ప్రాంతీయ వాదాన్ని రేకేత్తించడానికి సహాయపడతాయని పుర్కాయస్థ చెప్పారు. ‘‘బీజేపీ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చిన ప్రతిసారీ, మమతా బెంగాలీ గుర్తింపుతో ఎదురుదాడి చేస్తోంది’’ అని ఆయన అన్నారు.
జాతీయ భద్రతను అతిగా రాజకీయం చేయడం వలన దాని తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మహిళా పోలీసులపై బీజేపీ కార్యకర్తలు సిందూరం పూయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘వారు తీవ్రమైన ఆపరేషన్ ను రాజకీయ నాటకంగా మార్చడం ద్వారా దానిని చిన్నచూపు చూస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
భట్టాచార్య ఈ వ్యాఖ్యలు అంగీకరించారు. ఇది నకిలీ జాతీయవాదం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ను ఇప్పుడు నిజమైన అభివృద్ది, ప్రణాళిక లేని ట్రంప్ కార్డ్ గా ఉపయోగిస్తున్నారని అన్నారు.
బెంగాల్ లో వాస్తవ పరిస్థితులు
ఈ చర్చలో టీఎంసీ అట్టడుగు వర్గాల సంబంధాలపై కూడా సారించారు. అంఫాన్ తుఫాన్ వంటి విపత్తుల విపత్తుల సమయంలో మమత వ్యక్తిగతంగా పాల్గొనడం ఓట్లరతో ఆమెకున్న బంధాన్ని భట్టాచార్య అన్నారు. ‘‘ఆమె గొప్ప వక్త కాకపోవచ్చు. కానీ ముఖ్యమైన చోట ఆమె ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
బీజేపీ జాతీవాదాన్ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుంటుందని ఇద్దరు అంగీకరించారు. అయితే దీనికి విరుద్దంగా టీఎంసీ కూడా చురుకుగా దీనిని ఎదుర్కొంటోందని అన్నారు.
బెంగాల్ గౌరవానికి అవమానకరంగా ఆపరేషన్ సిందూర్ ను టీఎంసీ ఎలా వాడుకుంటుందో పుర్కాయస్థ అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు మాత్రం ఇవి పనిచేయవని అన్నారు. టీఎంసీ కొత్త కథనాన్ని తీసుకొస్తేనే కాషాయదళానికి చెక్ పెట్టవచ్చని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఊపును ప్రారంభించినప్పటికీ మమత విసిరిన సవాల్ రెండు పార్టీల మధ్య శక్తివంతమైన కథనాన్ని తీసుకొచ్చింది.
బెంగాల్ లో ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో జాతీయవాదం, ఉపజాతీయవాదం మధ్య ఘర్షణ అనివార్యంగా కనిపిస్తోంది. కానీ ఎవరూ తుది కథను ఎవరు రక్తికట్టిస్తారో చూడాలి.