ప్రతిపక్షాలతో పాటు ఆర్ఎస్ఎస్ సవాళ్లను బీజేపీ ఎదుర్కొబోతుందా?

రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే దశాబ్ధం తరువాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారిగా ప్రతిపక్షాలతో పాటు ఆర్ఎస్ఎస్ సవాళ్లను..

By :  Gyan Verma
Update: 2024-06-23 09:20 GMT

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం తన మొదటి పార్లమెంట్ పరీక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. దీనికి తోడు ప్రతిపక్షాలకు కాస్త బలం చేకూరింది. ఇప్పటికే బీజేపీ ప్రతిపక్షాలతో పాటు దానికి సైద్దాంతిక పునాదీ ఇస్తున్న ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొవడానికి సిద్దం అయినట్లు కనిపిస్తుంది.

NEET-UG పరీక్షలలో పేపర్ లీక్‌లు, NET రద్దు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి పనితీరు ప్రభావాలు పార్లమెంటు సమావేశాలలో కనిపించే అవకాశం ఉంది. అది ఏ రూపంలో ఉంటుంది?. నిరసనల రూపంలోనా? లేదా మరేదైన రూపంలోనా అని వేచి చూడాలి.
RSS అనుబంధ సంస్థల నుంచి ఒత్తిడి
ఈ కీలక అంశాలపై కేంద్రప్రభుత్వానికి సవాలు విసిరేందుకు ప్రతిపక్షాలు మాత్రమే కాదు. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు కూడా తమ డిమాండ్‌లను అంగీకరించాలని, రాబోయే బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రతిపక్షాల బలం పెరగడం, బీజేపీకి సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దశాబ్ధకాలంగా బీజేపీ నే సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని నడిపింది.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీనియర్ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ వారి కీలకమైన డిమాండ్‌లలో కొన్నింటిని నెరవెర్చే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా గ్రామీణ కష్టాలు, ఆర్థికంగా, సామాజికంగా బలహీనవర్గాల సమస్యలు, రైతుల డిమాండ్లు ఉండే అవకాశం ఉంది.
రైతులు, విద్యార్థులు
“కేంద్ర ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరుపుతోంది. రైతుల కష్టాలు, వారి డిమాండ్లు మాకు ముఖ్యమైనవి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరాం. కిసాన్ సమ్మాన్ నిధి కింద వారికి ఇచ్చే మొత్తాన్ని పెంచడం ఈ దిశలో మొదటి అడుగు. ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.” అని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) జాతీయ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా ఫెడరల్‌తో అన్నారు. BKS అనేది RSS యొక్క అనుబంధ సంస్థ, ప్రధానంగా రైతులు, వివిధ వ్యవసాయ సంఘాలతో కలిసి పనిచేస్తుంది.
కేవలం BKS మాత్రమే కాదు. ఇటీవల నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడంలో ముందున్న మరో RSS అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వంటి సంస్థల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చేసిన పనికి మొదట ఏబీవీపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు.
“మాకు మా డిమాండ్లు ఉన్నాయి. మా నాయకత్వం సోమవారం సీనియర్ కేంద్ర మంత్రులను సంప్రదింపుల కోసం కలిసినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాము. గత కొన్ని నెలలుగా, భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌లు, మధ్యాహ్న భోజనం వంట చేసేవారు. ఆశ వర్కర్లకు శాశ్వత ఉద్యోగాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలను డిమాండ్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ అంశంపై బీఎంఎస్ దేశవ్యాప్తంగా నిరసన కూడా నిర్వహించింది. ప్రభుత్వంతో చర్చించబోయే సమస్యలపై మా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది” అని BMS జాతీయ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ ది ఫెడరల్‌తో అన్నారు.
ప్రభావం కోసం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బృందం కూడా బిజెపి నిరాశాజనక ఎన్నికల పనితీరు ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం వాయిదాను కూడా క్లియర్ చేసింది.
గ్రామీణ సంక్షోభం, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించవచ్చని, ప్రతిపక్ష వ్యూహాన్ని ఎదుర్కోవడానికి బిజెపి నాయకత్వం ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందిస్తోందని బిజెపి సీనియర్ నాయకులు చెబుతున్నారు. రైతుల డిమాండ్లు రాబోయే హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకి, దాని మిత్రపక్షాలకు సాయపడతాయని భావిస్తున్నారు.
“రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులపై లాభాలు పొందే వరకు వారి సమస్యలు తీరవని మేము కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాము. ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతున్నప్పటికీ అది సరిపోవడం లేదు. కంపెనీలకు రాయితీలు ఇవ్వకుండా ఎరువులు, విత్తనాలపై రాయితీలు ఇవ్వడం ద్వారా రైతులకు ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించాలి. ఇది ఇన్‌పుట్ కాస్ట్‌ను తగ్గిస్తుంది ఎందుకంటే ఇది వారి లాభాలను పెంచడానికి సహాయపడుతుంది, ” అని మిశ్రా అన్నారు.
క్షీణత ప్రభావం
మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 2019  నాటి ఎన్నికల  పనితీరును బీజేపీ కనపరచలేకపోయింది. ఈ ఎన్నికల్లో గ్రామీణ కష్టాలు, రైతుల డిమాండ్లు జాతీయ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ ఎన్నికలలో "మర్యాద లోపము" ఉందని, ప్రజలకు సేవ చేసే నాయకులు "అహంకారంగా ఉండకూడదని" బహిరంగంగా పేర్కొన్నందున బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధ బాంధవ్యాలు క్షీణ దశలో ఉన్నాయని తెలుస్తోంది.
'బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు వేర్వేరు సంస్థలు. మోహన్ భగవత్, ప్రధాని మోదీల విలువ వ్యవస్థ ఒకేలా ఉన్నప్పటికీ, బీజేపీ నిర్ణయాధికారంలో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకుంటుందని చెప్పడం అన్యాయం. బీజేపీ నాయకత్వం తన నిర్ణయాలను తీసుకుంటుంది. బీజేపీ పై, ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు తప్పుబడుతున్నారు. అది అలా కాదు. బిజెపి నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల మధ్య ఎల్లప్పుడూ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది, ”అని నాగ్‌పూర్‌కు చెందిన పరిశీలకుడు ఆర్‌ఎస్‌ఎస్ వ్యాఖ్యాత దిలీప్ దేవధర్ ది ఫెడరల్‌తో అన్నారు.
Tags:    

Similar News