మన మహిళా నాయకులు ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్ కాదా? ఎందుకు?

కఠిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ఇందిరాగాంధీ, జయలలిత;

Update: 2025-06-02 08:43 GMT
కనిమొళి, రబ్రీదేవి, కల్వకుంట్ల కవిత

వారసులు లేకుండా నాయకులు మరణించిన సందర్భాల్లో మహిళలు నాయకులు ప్రతికూల పరిస్థితులు ఎదురైన తమ ప్రతిభను నిరూపించుకున్నారు. వారిలో ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మరో దివంగత సీఎం జయలలిత వారి శక్తిని చాటుకున్నారు.

మనమందరం తమ రాజ్యాలను ధైర్యంతో నడిపించి, శత్రువులతో పోరాడిన  భారతీయ రాణుల వీరోచిత పోరాటాలను వింటూ పెరిగాము. వారిలో ఝాన్సీ రాణి, రాణి చెన్నమ్మ, వేలు నాచియార్ వంటి వారు చాలా క్లిష్టపరిస్థితుల్లో సింహాసనాన్ని అధిష్టించారు. వీరికి సింహసనం మీద ఉన్న తండ్రి లేదా భర్త మరణించిన సమయంలో వారసుడు లేని సందర్భంలో రాజ్య భారాన్ని స్వీకరించారు.
21 వ శతాబ్దంలో ఏదయినా మారిందా?
ఇందుకు తాజా ఉదాహారణ కల్పానా సోరెన్. అర్హత కలిగిన ఇంజనీర్, పారిశ్రామికవేత్త. ఆమె భర్త హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్ట్ చేయడంతో ఆమె తన ప్రయివేట్ జీవితానికి ముగింపు పలికారు.
రాజకీయం అనుభవం లేకపోయినప్పటికీ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండి కూటమి తరఫున బరిలోకి దిగారు. చివరిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలుచుకుంది. కానీ అప్పటికే హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడంతో కల్పన గెలుపు మసకబారింది.
లోపలకు.. బయటకు..
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కూడా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 2023 లో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఆయన జైలు పాలయ్యారు. అప్పుడు పార్టీ పరిస్థితిని చక్కబెట్టడానికి భువనేశ్వరి ప్రచారంలోకి దిగారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి 2024 ఎన్నికల వరకూ ఆమె వీధుల్లో వచ్చి ప్రజలను కలుస్తూ పార్టీ నాయకులకు ధైర్యం చెప్పారు. నేడు ముఖ్యమంత్రి భార్యగా ఆమె రాజకీయేతర కార్యక్రమాల్లో రిబ్బన్లు కట్ చేస్తూ ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు.
నారా భువనేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమార్తె. అయితే ఆయన రెండో పెళ్లి చేసుకోవడంతో లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యం దక్కకూడదనే లక్ష్యంతో కొంతమంది పురుషులు చేసిన కుట్రలతో టీడీపీ చంద్రబాబు వశమైంది.
గృహిణి- ముఖ్యమంత్రి..
ఈ అంశంలో చాలా విలక్షణమైన, అందరి దృష్టిని ఆకర్షించే పేరు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి. 1997 లో భర్త లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణలపై జైలు పాలైనప్పుడూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను ఎప్పుడూ ప్లేస్ హోల్డర్ సీఎంగా చూసేవారు.
ఆమె మూడు పదవీకాలాల్లో కనీసం ఎనిమిది సంవత్సరాలు చురుకుదనంతో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించింది. నేడు ఆమె ఒక ఎంఎల్సీ కానీ ప్రజాజీవితానికి పూర్తిగా దూరమైంది.
భారతీయ మహిళా రాజకీయ నాయకురాలు చాలా అరుదు. వారి సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి, పెంపొందించుకుని తగిన సమయంలో ప్రతిఫలం పొందుతారు. ప్రస్తుతం అంచనా ప్రకారం.. ఒక నాయకుడు అనారోగ్యానికి గురైనప్పుడూ, మరణించినప్పుడూ, జైలు శిక్ష అనుభవించినప్పుడూ మాత్రమే అతని కుటుంబంలోని ఒక మహిళా ప్రజా జీవితంలో వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తారు.
అయితే ఇందులో ఆమె అంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరించదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదు. తిరిగి అసలు వ్యక్తి వచ్చినప్పుడూ ఆమె వినయంగా ఇంటికే పరిమితమయ్యారు.
భారతీయ పురుష రాజకీయ నాయకులు తమ భార్యలు, సోదరిమణులు, లేదా కుమార్తెలు తమ పదవులను కాపాడుకోవడానికి ముందుకు తెస్తున్నారు. పురుష స్టెప్నీ ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక ఉదాహారణలు ఉన్నాయి.
పెరుగుతున్న ఆశలు..
హేమంత్ సోరెన్ జైలులోకి వెళ్లినప్పుడూ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపాయ్ సోరెన్, తరువాత తన పదవినీ వదులుకోవడంలో ఆసక్తి చూపలేదు.
అంతకుముందు బిహార్ లో ఇలాంటి రాజకీయమే కనిపించింది. 2014 లో నితీష్ కుమార్ తన సీఎం పదవిని జీతన్ రామ్ మాంఝీ కు ఇచ్చారు. మొదట్లో ఆయనను తొలుబొమ్మ సీఎం గా అంతా ఎగతాళి చేశారు. అయితే పది నెలల తరువాత నితీష్ తన పదవికి తిరిగి తీసుకునే సమయంలో మాంఝీ తిరుగుబాటు చేశాడు.
ఆయన జేడీ(యూ) నుంచి విడివడి సొంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా సెక్యులర్ ను స్థాపించి, బీజేపీలో చేరాడు. నేడు ఆయన ఎంఎస్ఎంఈ మంత్రి.
దక్షిణాదిలో పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీ స్థాపకుడు ఎస్ రామదాస్, ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అన్భుమణి రామదాస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఆసక్తికర కుటుంబ పోరాటాలు..
భారత రాజకీయాలలో కూతుళ్లు తమ తండ్రులపై తిరుగుబాటు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సందర్బాల్లో వారు తమ సోదరులు, ఇతర బంధువులతో పోరాడుతుంటారు. ఇందుకు తాజా ఉదాహరణలు వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్నది.
మరో వైపు 2జీ స్కాం లో ఆరు నెలలకు పైగా తీహర్ జైలులో గడిపిన కనిమొళిని మనం చూశాం. దీనిని తిరిగి చూసుకుంటే మన్మోహన్ సింగ్ పాలనను అంతం చేయడానికి తీసుకొచ్చిన పెద్ద కుట్రగా చెప్పవచ్చు.
తమిళనాడు రాజకీయాలలో కరుణానిధి వారసులు ఎవరూ ఇంత ఎక్కువగా ఇబ్బందిపడలేదు. ఆమె నుంచి డీఎంకే పెద్దగా ఏమి ఆశించలేదు. మంచి విద్యావంతురాలు, వాక్చాతుర్యం ఉంది.
ప్రస్తుతం డీఎంకే వారసుడు చాలా చిన్నవాడు. ప్రారంభంలో రాజకీయాలంటే ఆసక్తి కనపరచలేదు. తన తాత, తండ్రి స్థానంలోకి రావడానికి ఆయనకు మరో దశాబ్ధ కాలం పడుతుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలలు జైలులో ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కే. కవిత కూడా ఉన్నారు. ఆమె బెయిల్ పై బయటకు వచ్చి, సోదరుడు కేటీ రామారావు సహ తన పార్టీ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన తండ్రిని జాగ్రత్తగా దూరంగా ఉంచుతోంది.
ఫస్ట్ చాయిస్..
చాలామంది రాజకీయ నాయకులు తమ వారసులుగా కుమారులనే ఎంచుకున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ పిల్లల నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ త్వరగా అధికారంలోకి వచ్చారు. బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతవారం లాలూ తన సొంత కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించారు.
ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. లాలూకు మద్దతుగా నిలిచిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఆయనకు కిడ్నీ ఇవ్వడమే కాకుండా ‘‘నాన్న దేవుడిలాంటి వారు, కుటుంబమే మా ఆలయం’’ అని అన్నారు.
రోహిణి, ఆమె సోదరి మీసా భారతి గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోటములు చవిచూశారు. కానీ అది వారి రాజకీయ జీవితానికి పెద్దగా మార్పు ఉండదు.
ఈ కార్యక్రమాలకు తేజస్వీ యాదవ్ నాయకుడిగా ఉంటాడు. తేజ్ ప్రతాప్ తన దారిలో తను దూసుకుపోతాడు. కానీ కుమార్తెలు సాధారణ పరిస్థితుల్లో పార్టీలో ఎదగాలనే ఆశలు కూడా ఉండవు.
విజయవంతమైన వారు..
అత్యవసర పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, తమ ముద్రను చూపించిన నాయకురాళ్లు ఉన్నారు. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత సోనియా గాంధీ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి, ఆమె కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)మరణించినప్పుడూ ఆయన భార్య జానకీ రామచంద్రన్ త్వరగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె కేవలం మూడు వారాలపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. తరువాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు దారితీసింది.
తరువాత ఎంజీఆర్ శిష్యురాలు జే. జయలలిత తన స్థానం కోసం పోరాడారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురై, అవమానానికి గురైన ఆమె రాజకీయాల్లో రాణించడానికి ముందు అనేక అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది.
అయితే మగ తోబుట్టువులు ఉంటే ఇందిరాగాంధీ, సుప్రియా సూలే రాజకీయాల్లో ఉండేవారా? తెలియదు. పోయిన సంవత్సరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ కెరీర్ ను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అధికార సమతుల్యతలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
రాజకీయ రాజవంశాలలో మహిళలకు మార్గం చాలా కఠినమైనది. సాధారణ మహిళలని ముద్రవేసిన ప్రతిసారీ అలాంటివి మునిగిపోయాయి. మమతా బెనర్జీ, మాయవతి, స్మృతి ఇరానీ దశాబ్ధాలుగా ఎదుర్కొన్న అనేక ఆటంకాలు మనల్నీ సిగ్గుపడేలా చేయాలి.
సమానత్వం అర్థవంతంగా ఉండేచోట..
మహిళా రిజర్వేషన్ బిల్లు- 2023 లో చాలా పార్టీలు వ్యతిరేకించిన చివరకు బిల్లు ఆమోదం పొందింది. రెండేళ్ల తరువాత జాతీయ జనాభా గణన వచ్చే ఏడాది నిర్వహించినప్పటికీ, దానిని ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై స్పష్టత లేదు.
వాస్తవానికి జనాభా లెక్కల గురించి ఇప్పుడు కుల సర్వే, నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో ఎక్కువగా మాట్లాడుతోంది. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు హమీ ఇచ్చిన 33 శాతం సీట్ల గురించి చాలా తక్కువ చర్చ జరగుతోంది.
మహిళలు అధికార రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ది చెందగల వాతావరణాన్ని సృష్టించడం, అది వారి సొంత మహిళలు అయినా బయటి వ్యక్తులు ఒకే విధంగా అవకాశాలు ఉండాలి.
డీఈఐ( వైవిధ్యం, ఈక్విటీ, ఇంక్లూజన్) నియామకం లాగానే మహిళలను బోర్డులోకి తీసుకురావడం అంటే విస్తృత శ్రేణి అభ్యర్థులను ఎంచుకోవడం ద్వారా లాభాలు సంపాదించడం.
Tags:    

Similar News