బి ఆర్ ఎస్ పార్టీలో నాలుగు స్తంభాలాట
కెసిఆర్ నేరుగా పిలిచి మాట్లాడగానే బెట్టును వీడి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కవిత ఉపశమనం పొందుతుంది. అంతా ఒల్లెక్కాలా ఆటలు మాటలు.;
By : జూకంటి జగన్నాథం
Update: 2025-05-29 06:09 GMT
ఇటీవల ‘తెలంగాణ జాగృతి’ కవిత వాళ్ల నాన్నకు ఒక లేఖ రాయగానే ఏదో అంతర్గతంగా జరిగిపోతుందని చిలువలు పలువలుగా ఎవరికి తోచించి వాళ్ళు ఊహించుకొంటుంన్నారు. ఇది ఇలా ఉండగానే టిఆర్ఎస్ పార్టీలో కవిత నిర్ణయాలు తనదైన రీతిలో తీసుకుంటున్నారు .కవిత రాజకీయ వ్యూహాల నిర్ణయాలు రోజుకో తరీఖ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకరు టిఆర్ఎస్ పార్టీ పని ఇక అయిపోయిందని అంటే,మరొ కరు కెసిఆర్ దృష్టిలో పడితే ఖతమై పోతారని కవిత హరీష్ లు ఇక ముందు వారి దారి వారు చూసుకోవాలి అని ఉద్బోధిస్తారు. ఇది వారి కుటుంబ సభ్యుల పట్ల పార్టీ అధ్యక్షుడు కఠిన నిర్ణయాలు తీసుకోలేడని అయ్యగారి ఉల్లిగడ్డ శాస్త్రం మని అటువంటి నిర్ణయాలు ఇతరులకు మాత్రమే వర్తిస్తాయని గమనించక తెలియక ప(త) ప్పులే కాలు వేస్తుంటారు. అప్పుడే సంబంధిత పార్టీలో ఏదో జరగబోతుందని ఒక చర్చను అప్పుడే మీడియాహస్ లలో చర్చోప చర్చలు లేవదీశారు. కవిత రెండో విలేకరుల సమావేశంలో తన నాన్న దేవుడని దేవుడి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని ఆరోపించారు . దీనితో మళ్లీ మీడియాలో మరో వ్యాఖ్యానానికి కవిత చోటు కల్పించినట్టు అయింది .
బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబంలో ఇలా నాలుగు స్తంభాలాట కొనసాగడం ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం తెలిసినవారికి కొత్త విషయం ఏమీ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తమ మధ్య తీవ్ర వైరుధ్యాలు మోతాదుకు మించి అసంతృప్తులు ఉన్నట్టు వారే స్వతహాగా లీకులు ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలు పురావృత్తం అయిన ప్రతిసారీ ఇక పార్టీ పని అయిపోయినట్టేనని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు భావిస్తుంటారు. కొండకచో మీడియా ఈ విషయమే ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ వుంటుంది
2001, ఫిబ్రవరి 27న తెలంగాణ సాధన ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికలలో అధికారం చేపట్టాక కెసిఆర్ ఇక టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని స్వయంగా ప్రకటించాడు. అప్పటికే పక్కా తెలంగాణ వాదులను అడిగే వారిని అనే వారిని కెసిఆర్ ముందు జాగ్రత్త ఏదో నెపం మోపి బయటకు పంపించాడు. తనకు తన కుటుంబ నాయకులకు ఉద్యమకారుల నుంచి ఈషన్మా త్రం కూడా ముప్పు విమర్శలు ఒత్తిళ్లు ప్రశ్నలు రాకుండా ముందే తగు చర్యలు తీసుకున్నాడు.. తెలంగాణ కోసం నిబద్ధతతో పని చేసే ఉద్యమ నాయకులు కెసిఆర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేక పోవడం వలన తెలంగాణకు మరోసారి తీరని ధోకా జరిగింది. తెలంగాణ ప్రజల బతుకులు మరోసారి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది.
నీళ్లు నిధులు నియామకం ప్రధాన పతాక నినాదాన్ని తిరిగేసి మిషన్ల పేరిట ప్రత్యక్ష పరీక్ష అప్పులు తెచ్చి తెలంగాణ అభివృద్ధి చెవిలో పువ్వులు పెట్టారు. పదేళ్లలో ఈ నాయకులు పట్టపగ్గాలు లేకుండా సంపాదించి ప్రజలతో కన్ను మిన్నూ కానకుండా ప్రవర్తించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుటుంబ నాయకులలో ఒకరైన కేటీఆర్ తెల్లారి లేస్తే ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండడం వలన గత పది సంవత్సరాలలో తాము చేసిన నిర్వాకాన్ని అడుగడుగునా గుర్తు చేస్తున్నట్టు అవుతుంది తప్ప ప్రజలు ఆలోచించడం లేదని ఆయన చేస్తున్న ఆరోపణలు గుట్టకు మొరిగిన కుక్కలా అయిపోతున్నాయి ఎరుగలేకపోతున్నారు. ఇకపోతే హరీష్ రావు తన కోటరీని కాపాడుకుంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద తీస్మార్ ఖాన్ లా మీడియాను మేనేజ్ చేస్తూ ఆవాకులు చెవాకులు పేలుకుంటూ తన తీవ్ర అసంతృప్తిని ఎక్కడ బయట పడనీయకుండా సెల్ఫ్ డిఫెన్స్ రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. ఇకపోతే తెలంగాణను బతుకమ్మ పేరుతో జాగృతం చేస్తూ ఏటేటా ఆడబిడ్డ కట్నాలు పొందిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత కూడా నేనూ కూడా మైదానంలో ఉన్నానని అప్పుడప్పుడు అధికార పార్టీని విమర్శిస్తుంటుంది. పైకి పార్టీలో వీరి మధ్య భేదాభిప్రాయాలు పొడ చూపినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇకపోతే పార్టీ అధినాయకుడు కేసిఆర్ ఫామ్ హౌస్ లో నుంచి అప్పుడప్పుడు రాజకీయ అతిథిలా తెర మీదికి వచ్చిపోతుంటాడు. పార్టీలో సంక్షోభాలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడల్లా వీరు నాలుగు స్తంభాల ఆట ఆడుతుంటారు. ప్రజలు ఓడించినప్పటికీ కనీసం జ్ఞానోదయం కానీ పశ్చాత్తాపం ప్రకటించని పార్టీకీ నాయకులకు ప్రజలలో పతారా దిగజారి పోయిందని తెలుసుకోలేక పోతున్నారు. పైగా వీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియాలలో తమ గురించి అహరహం వార్తలు ఉండేలా, ప్రచారం జరిగేలా చూసుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంటారు.
కవిత రేపిన ఎపిసోడ్ మొత్తాన్ని సారాంశంలో చూస్తే షర్మిల వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి బయటకు వచ్చినట్టే కవిత తన లేఖ ద్వారా విలేకరుల సమావేశాలు ద్వారా పార్టీలో ఒక అననుకూల వాతావరణం ఏర్పడిందని కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర విభేదాలు ఉన్నట్టు టి కప్పులో తుఫాన్లు సృష్టిస్తుంటుంది. వీరందరూ ఎన్నెన్ని మాటలు చెప్పినా మాట్లాడిన ఇప్పటికీ కెసిఆర్ చాటు బిడ్డలేనని భావించాల్సి వస్తుంది. ఆ తుఫాను తీరం దాటకుండానే,కెసిఆర్ నేరుగా పిలిచి మాట్లాడగానే తమ తమ బెట్టును వీడి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉపశమనం పొందుతుంది. అంతా ఒల్లెక్కాలా ఆటలు మాటలు.
కవిత టిఆర్ఎస్ పార్టీలోని హావభావాలు ముఖ కవళికలను చూస్తే షర్మిల ఎపిసోడ్ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే నేను లేకుంటే వైయస్సార్ పార్టీ ఉండేది కాదని , తన అన్న ముఖ్యమంత్రి కాకపోయే వాడని అనుకొని మీడియాలో ఊరు వాడ ఒక్కటి చేసి చేయవలసినంత యాగి చేసింది. షర్మిల ఆశించిన కోరిక తీరకపోవడంతో అవకాశాలు రాకపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్ష సారధ్య బాధ్యతలతో సర్దుకున్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబంలో ఇలా నాలుగు స్తంభాలాట కొనసాగడం ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం తెలిసినవారికి కొత్త విషయం ఏమీ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తమ మధ్య తీవ్ర వైరుధ్యాలు మోతాదుకు మించి అసంతృప్తులు ఉన్నట్టు వారే స్వతహాగా లీకులు ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలు పురావృత్తం అయిన ప్రతిసారీ ఇక పార్టీ పని అయిపోయినట్టేనని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు భావిస్తుంటారు. కొండకచో మీడియా ఈ విషయమే ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ వుంటుంది
2001, ఫిబ్రవరి 27న తెలంగాణ సాధన ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికలలో అధికారం చేపట్టాక కెసిఆర్ ఇక టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని స్వయంగా ప్రకటించాడు. అప్పటికే పక్కా తెలంగాణ వాదులను అడిగే వారిని అనే వారిని కెసిఆర్ ముందు జాగ్రత్త ఏదో నెపం మోపి బయటకు పంపించాడు. తనకు తన కుటుంబ నాయకులకు ఉద్యమకారుల నుంచి ఈషన్మా త్రం కూడా ముప్పు విమర్శలు ఒత్తిళ్లు ప్రశ్నలు రాకుండా ముందే తగు చర్యలు తీసుకున్నాడు.. తెలంగాణ కోసం నిబద్ధతతో పని చేసే ఉద్యమ నాయకులు కెసిఆర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేక పోవడం వలన తెలంగాణకు మరోసారి తీరని ధోకా జరిగింది. తెలంగాణ ప్రజల బతుకులు మరోసారి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది.
నీళ్లు నిధులు నియామకం ప్రధాన పతాక నినాదాన్ని తిరిగేసి మిషన్ల పేరిట ప్రత్యక్ష పరీక్ష అప్పులు తెచ్చి తెలంగాణ అభివృద్ధి చెవిలో పువ్వులు పెట్టారు. పదేళ్లలో ఈ నాయకులు పట్టపగ్గాలు లేకుండా సంపాదించి ప్రజలతో కన్ను మిన్నూ కానకుండా ప్రవర్తించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుటుంబ నాయకులలో ఒకరైన కేటీఆర్ తెల్లారి లేస్తే ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండడం వలన గత పది సంవత్సరాలలో తాము చేసిన నిర్వాకాన్ని అడుగడుగునా గుర్తు చేస్తున్నట్టు అవుతుంది తప్ప ప్రజలు ఆలోచించడం లేదని ఆయన చేస్తున్న ఆరోపణలు గుట్టకు మొరిగిన కుక్కలా అయిపోతున్నాయి ఎరుగలేకపోతున్నారు. ఇకపోతే హరీష్ రావు తన కోటరీని కాపాడుకుంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద తీస్మార్ ఖాన్ లా మీడియాను మేనేజ్ చేస్తూ ఆవాకులు చెవాకులు పేలుకుంటూ తన తీవ్ర అసంతృప్తిని ఎక్కడ బయట పడనీయకుండా సెల్ఫ్ డిఫెన్స్ రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. ఇకపోతే తెలంగాణను బతుకమ్మ పేరుతో జాగృతం చేస్తూ ఏటేటా ఆడబిడ్డ కట్నాలు పొందిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత కూడా నేనూ కూడా మైదానంలో ఉన్నానని అప్పుడప్పుడు అధికార పార్టీని విమర్శిస్తుంటుంది. పైకి పార్టీలో వీరి మధ్య భేదాభిప్రాయాలు పొడ చూపినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇకపోతే పార్టీ అధినాయకుడు కేసిఆర్ ఫామ్ హౌస్ లో నుంచి అప్పుడప్పుడు రాజకీయ అతిథిలా తెర మీదికి వచ్చిపోతుంటాడు. పార్టీలో సంక్షోభాలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడల్లా వీరు నాలుగు స్తంభాల ఆట ఆడుతుంటారు. ప్రజలు ఓడించినప్పటికీ కనీసం జ్ఞానోదయం కానీ పశ్చాత్తాపం ప్రకటించని పార్టీకీ నాయకులకు ప్రజలలో పతారా దిగజారి పోయిందని తెలుసుకోలేక పోతున్నారు. పైగా వీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియాలలో తమ గురించి అహరహం వార్తలు ఉండేలా, ప్రచారం జరిగేలా చూసుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంటారు.
కవిత రేపిన ఎపిసోడ్ మొత్తాన్ని సారాంశంలో చూస్తే షర్మిల వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి బయటకు వచ్చినట్టే కవిత తన లేఖ ద్వారా విలేకరుల సమావేశాలు ద్వారా పార్టీలో ఒక అననుకూల వాతావరణం ఏర్పడిందని కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర విభేదాలు ఉన్నట్టు టి కప్పులో తుఫాన్లు సృష్టిస్తుంటుంది. వీరందరూ ఎన్నెన్ని మాటలు చెప్పినా మాట్లాడిన ఇప్పటికీ కెసిఆర్ చాటు బిడ్డలేనని భావించాల్సి వస్తుంది. ఆ తుఫాను తీరం దాటకుండానే,కెసిఆర్ నేరుగా పిలిచి మాట్లాడగానే తమ తమ బెట్టును వీడి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉపశమనం పొందుతుంది. అంతా ఒల్లెక్కాలా ఆటలు మాటలు.
కవిత టిఆర్ఎస్ పార్టీలోని హావభావాలు ముఖ కవళికలను చూస్తే షర్మిల ఎపిసోడ్ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే నేను లేకుంటే వైయస్సార్ పార్టీ ఉండేది కాదని , తన అన్న ముఖ్యమంత్రి కాకపోయే వాడని అనుకొని మీడియాలో ఊరు వాడ ఒక్కటి చేసి చేయవలసినంత యాగి చేసింది. షర్మిల ఆశించిన కోరిక తీరకపోవడంతో అవకాశాలు రాకపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్ష సారధ్య బాధ్యతలతో సర్దుకున్నారు.
ఎలాగైతేనే మొత్తానికి తన అన్నను జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయగలిగింది. కానీ అక్కడ షర్మిల తండ్రి లోకంలో లేని సమయంలో ఇదంతా జరగడానికి అవకాశం ఏర్పడింది. కానీ కవిత తండ్రి కేసీఆర్ జీవంగా ఉన్నాడు. తమ ఇంటి నుంచే దేవుని తలువాలకు, తద్దినాలకు పిడుక్కు ,దయ్యానికి బియ్యం అన్నిటికీ తమ గడప నుంచి పోవాలని తలంపు ఉన్న ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న కెసిఆర్ అదే ధోరణితో ఆలోచించే పన్నాగాలు అలాగే ఉంటాయి. ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . తమ వ్యూహాలు పని చేయనప్పుడు కౌంటర్ రాజకీయాలు రచించి అమలు చేయడం కేసీఆర్ లక్షణం. బహుశా కవిత ద్వారా లోపాయికారీగా ప్రారంభించినా ఆశ్చర్య పడ వలసిన అవసరం లేదు.
కవిత ద్వారా తాము పోగొట్టుకున్న చోటే అధికారం పొందడానికి కవితను ఇప్పటికి పల్లెత్తు మాట్లాడని కెసిఆర్ అదే దేశీయ వెచ్చాలని రాజకీయ కల్వంలో వేసి నూరుతుంటాడు.ఆయన అవకాశాల కోసం పొంచి ఉన్న దెబ్బతిన్న పులిలా ఎదురుచూస్తుంటాడు.
కెసిఆర్ మేటి వేషం వేయగలడు అదే ఏకకాలంలో బుడ్డర్ఖాన్ వేషం వేయగల సమర్ధుడు. ఆయన గురువులకు పంగనామాలు పెట్టే నమ్మిన వాళ్లను నట్టేట ముంచే కెసిఆర్ గత రాజకీయ చరిత్రను చూసినవారు దగ్గరగా నిశితంగా గమనించిన వారు అనుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.