పూరీ జగన్నాథ రథయాత్రలో 625 మందికి అస్వస్థత

రథోత్సవంలో బాలభద్రుని రథం (తలధ్వజ) దాదాపు గంటపాటు నిలిచిపోవడంతో భక్తులు ఒకేచోట ఆగిపోయారు. అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో కొంతమందికి గాయాలయినట్లు సమాచారం.;

Update: 2025-06-28 08:28 GMT
Click the Play button to listen to article

ఒడిశా(Odisha) రాష్ట్రం పూరీ జగన్నాథ(Puri Jagannath Temple) రథయాత్ర(Rath Yatra)లో సుమారు 625 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది సృహ కోల్పోయారు. మరికొంతమందికి వాంతులయ్యాయి. వెంటనే వీరిని పూరీలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఎక్కువమంది ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకుని తమ ప్రాంతాలకు వెళ్లిపోయారని జిల్లా వైద్యాధికారి డా. కిశోర్ సత్పథీ తెలిపారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న 70 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఎండ, అధిక తేమతో కూడిన వాతావరణమేనని భక్తుల అస్వస్థతకు కారణమని ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి ముకేశ్ మహలింగ్ పేర్కొన్నారు.

రథం నిలిచిపోవడంతోనే..

రథోత్సవంలో బాలభద్రుని రథం (తలధ్వజ) దాదాపు గంటపాటు నిలిచిపోవడంతో భక్తులు ఒకేచోట ఆగిపోయారు. అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో కొంతమందికి గాయాలయినట్లు సమాచారం. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.

9 రోజుల పాటు నిర్వహించే రథయాత్ర వేడుకలు ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. జూలె 5తో ముగుస్తాయి.

Tags:    

Similar News