లండ‌న్‌కు వెళ్లిపోయిన క్రికెటర్ విరాట్ కొహ్లీ..

‘‘అరెస్ట్ కొహ్లీ’’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులు..;

Update: 2025-06-06 12:13 GMT
Click the Play button to listen to article

బెంగళూరు(Bangalore) తొక్కిసలాట(Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఐపీఎల్‌లో కప్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం సమీపంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తర్వాత తేరుకున్న కర్ణాటక (Karnataka)

సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah).. పోలీసుల వైఫల్యాన్ని తప్పుబడుతూ బెంగళూరు పోలీసు కమిషనర్‌తో పాటు మరికొంతమంది పోలీసులు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్‌సీబీ ప్రతినిధులు, డీఎన్‌ఎ ఈవెంట్ మేనేజర్లు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. 10 లక్షల ప్రకటించి రిటైర్డ్ జడ్జితో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

#ArrestKohli - సోషల్ మీడియాలో ట్రెండింగ్..

ఈ విషాదకర సమయంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కాతో కలిసి లండన్‌ వెళ్లిపోవడం కొంతమందికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కోహ్లీపై కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలన్న డిమాండ్ మొదలైంది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టిన పోస్టులు బాగా ట్రెండ్ అయ్యాయి. “ఇది మంచిది కాదు” అని ఎక్స్ యూజర్ ప్రీత్ మీనా పోస్ట్ చేశారు. "కేవలం అభిమానులను పెంచుకోడానికే విక్టరీ పరేడ్ నిర్వహించారు’’ అని మరో ఎక్స్ ఖాతాదారుడు ఆరోపించారు.

అయితే మహేష్ సింగ్ జాత్ అనే ఒక యూజర్ కోహ్లీని సమర్థిస్తూ పోస్టు పెట్టారు. ‘‘సెంచరీలు చేసినప్పుడు, అందరూ కోహ్లీ గురించి గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు "నిర్వహణలో లోపం" జరిగిన తప్పిదానికి ఆయనను ఎందుకు నిందిస్తున్నారు అని పేర్కొన్నారు. 

ఘటన ఎలా జరిగింది?

ఐపీఎల్‌ చరిత్రలో 18 సంవత్సరాల తర్వాత మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. ఈ ఆనందాన్ని జట్టు సభ్యులు తమ అభిమానులతో షేర్ చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని RCB సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ తర్వాత హోం మంత్రి జి పరమేశ్వర ఓపెన్-టాప్ విక్టరీ పరేడ్ ఉండదని చెప్పారు. ఈ రెండు విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. మరోవైపు స్టేడియంలోనికి ఫ్రీగా అనుమతిస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి స్టేడియ కెపాసిటీ 40 వేలు. కాని స్టేడియం వద్దకు చేరుకుంది సుమారు 3 లక్షల మంది.  

Tags:    

Similar News