వైద్య శాఖలో 16 వేల మందికి పదవీకాలం పోడిగింపు
ఉత్తర్వులు జారి చేసిన ఆర్థిక శాఖ;
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 16 వేల మంది పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారి చేసింది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హనరోరియం, మల్టీ టాస్కింగ్, విధానంలో పని చేస్తున్న 16 వేల మంది పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. డీ ఎంఈ పరిధిలో రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్దతిలో 4, 772 మంది, ట్ సోర్సింగ్ విధానంలో 8 615 మంది, హనరోరియం పోస్టుల్లో 3, 056 మంది ఎంఎంటిఎస్ విధానంలో ఐదుగురు పని చేస్తున్నారు.
మొత్తం 16వేల 448 మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు , నర్సింగ్, డెంటల్ కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టీచింగ్ ఫాకల్టీ, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, డీఈఓలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. డీఎంఈ విఢాగంలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కొనసాగుతాయి.