టీపీసీసీకి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రెటరీలు...
కాంగ్రెస్ చరిత్రలో ఇది రికార్డు...;
కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.కనిపించిన వాళ్లందరిని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా , ప్రధాన కార్యదర్శులుగా నియమించేసింది. ఇద పెద్ద ఎత్తన పార్టీకి ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించడం చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు.
వీళ్లందరికి కార్యాలయాలు సమకూర్చేందుకు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ చాలు. 96 గదులున్న వసతులు హైదరాబాద్ తక్కువ. పిసిసి సమావేశం ఏర్పాటు చేయాలంటే ఎల్ బిస్టేడియమో లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వెళ్లాల్సి వస్తుంది.
పదవులీయకపోతే అసంతృప్తి చెలరేగుతుందని కాంగ్రెస్ పార్టీ బాగా భయపడుతున్నట్లు ఈనియామకాలతో అర్థమవుతుంది. ఎందుకంటే, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేను కూడా నియమించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలా తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భారీగా పదవుల పందేరం చేసింది. దాదాపు 96 మందికి పదవులు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఐదు కమిటీలను ప్రకటించిన పార్టీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్షులుగా, 69 మందికి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం అందించింది.
67 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీ లకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ తో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేస్తున్న అనేక.మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టీపీసీసీ ఆఫీస్ బేరర్లు గా అవకాశాలు దక్కాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ తో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ పని చేసిన అనేక మంది కాంగ్రెస్ నాయకులకు స్థానం దక్కడంతో కాంగ్రెస్ పార్టీ లో హుషారు కనిపిస్తుందని పార్టీ భావించి ఉండవచ్చు.
ఉపాధ్యక్షులు వీరే
శ్రీ టి. కుమార్ రావు
శ్రీ కె. రఘువీర్ రెడ్డి, ఎంపీ
శ్రీ నైని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే
శ్రీ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ
శ్రీ బసవరాజు సరయ్య, ఎమ్మెల్సీ
శ్రీమతి హనుమండ్ల జానకీ రెడ్డి
శ్రీ బండి రమేష్
శ్రీమతి కొండ్రు పుష్పలీల
శ్రీమతి కోట నీలిమ
శ్రీ బి. కైలాష్ కుమార్
శ్రీ నమిన్ల శ్రీనివాస్
శ్రీమతి ఆత్రం సుగుణ
శ్రీ గళ్లి అనిల్ కుమార్
శ్రీ చిట్ల సత్యనారాయణ
శ్రీమతి లకవత్ ధన్వంతి
శ్రీ ఎం. వెంకయ్య గౌడ్
శ్రీ కోటమ్రెడ్డి వినయ్ రెడ్డి
శ్రీ కొండేటి మల్లయ్య
శ్రీ ఎం.ఏ. ఫహీం (సంగారెడ్డి)
శ్రీ ఎస్. సురేష్ కుమార్
శ్రీ బొంతు రమ్మోహన్
శ్రీ అఫ్సర్ యూసుఫ్ జాహి
శ్రీ ఎస్. జగదీశ్వర్ రావు
శ్రీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్
శ్రీ గుమ్ముల మోహన్ రెడ్డి
శ్రీ చిన్నపాటల సంగమేశ్వర్
జనరల్ సెక్రటరీలు
శ్రీ వేద్మ బోయిజు, ఎమ్మెల్యే
శ్రీమతి చ. పార్నికా రెడ్డి, ఎమ్మెల్యే
డాక్టర్ మట్ట రాగమయి, ఎమ్మెల్యే
. రాంభూపాల్
శ్రీ ఎ. సంజీవ్ ముదిరాజ్
శ్రీమతి బోయిజ సంధ్య రెడ్డి
శ్రీ మల్లాడి రామ్ రెడ్డి
కుమారి అబ్దేషి సదా లక్ష్మి
శ్రీమతి ఎం. బేబీ స్వర్ణ కుమారి
శ్రీ ధారసింగ్ తాండూరు
శ్రీమతి జి. శశికళ యాదవ రెడ్డి
ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి
శ్రీ మొహమ్మద్ అబ్దుల్ ఫహీం
శ్రీ సంతోష్ కుమార్ రుద్ర
శ్రీ దుర్గం భాస్కర్
శ్రీ మొహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్
శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్
శ్రీ నరేష్ జాదవ్
శ్రీ అల్లం భాస్కర్
డాక్టర్ గిరిజా శేట్కర్
శ్రీ కొప్పుల ప్రవీణ్ కుమార్
శ్రీ ఎ. జంగా రెడ్డి
శ్రీ కాష శ్రీనివాస్ రావు
శ్రీ దుద్దిల్ల శ్రీనివాస్
శ్రీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
శ్రీ చరగాని దయాకర్
శ్రీ పీసరి మహిపాల్ రెడ్డి
శ్రీ గజ్జెల కాంతం
శ్రీ ఎడుపుగంటి సుబ్బారావు
శ్రీ చకిలం రాజేశ్వర రావు
శ్రీ ఎర్లా కొమరయ్య
డాక్టర్ ఎ. రవి బాబు
శ్రీ నాగ సీతారాములు
శ్రీ సనేం శ్రీనివాస్ గౌడ్
శ్రీ ప్రుద్ధ్వి చౌదరి వేముల
శ్రీ అంబాడి రాజేశ్వర్
శ్రీ డి.డి. వెంకట్ రాజ్
శ్రీ బొడ్డ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి
శ్రీ పల్లె శ్రీనివాస్ గౌడ్
శ్రీ మొహ్ద్ సబీర్ అలీ
శ్రీ కాట్ల రంగా రావు
శ్రీ పి. శ్రీనివాస్ రెడ్డి
శ్రీ మాడు సత్యనారాయణ గౌడ్
శ్రీ తోపాజి అనంత కిషన్
శ్రీ వి. రామ రావు గౌడ్
శ్రీ అచ్యుత్ రమేష్ బాబు
శ్రీ పెద్దనొల్ల బాల మురళీ కృష్ణ (చిన్న)
శ్రీ ఎం. రాజీవ్ రెడ్డి
శ్రీ ఆదం రాజ్ డెకపాటి
శ్రీమతి షమీమ్ ఆఘా
శ్రీ ఇ.వి. శ్రీనివాస్ రావు
శ్రీ మిథున్ రెడ్డి
శ్రీ అమోఘోత్ వెంకటేష్ పవార్
శ్రీమతి రాయగిరి కల్పన యాదవ్
శ్రీ రాజేష్ కాషిపాక
శ్రీ రహమత్ హుస్సేన్
శ్రీ పి. ప్రశాంత్ కుమార్ శర్మ
శ్రీ మొహమ్మద్ అసదుద్దీన్
శ్రీ నందిమల్ల యాదయ్య ముదిరాజ్
శ్రీ దైద రవీందర్
శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త
శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
శ్రీ జి. నాగభూషణం
శ్రీ ఉపేందర్ రెడ్డి
శ్రీ ధర్మా రావు
శ్రీ నూతి సత్యనారాయణ గౌడ్
శ్రీ దుర్గా ప్రసాద్
డాక్టర్ సి. వెంకట గోవింద్ రావు
శ్రీ పెండ్లి శ్రీనివాసులు రెడ్డి