అలా చేసుంటే కేంద్రం పరువు పోయేది!

కాళేశ్వరంకు జాతీయ హోదా పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు;

Update: 2025-06-22 07:24 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుంటే కేంద్ర ప్రభుత్వం ఇజ్జత్ పోయేదని ఆయన వ్యాఖ్యానించారు.కేసీఆర్ కుటుంబం విషయంలో రేవంత్ ప్రభుత్వం రక్షణగా నిలుస్తోందని , పైకి ఎంక్యైరీలు అంటూ ఎందులోనూ కనీస చర్యలు వుండటం లేదన్నారు.కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకు అప్పగించాలన్నారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మొదటి నుంచి కేంద్రం పెద్దలు మోదీ, అమిత్ షా పదకొండేళ్ల క్రితం నుంచి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపిస్తూనే వున్నారని తెలిపారు.కాళేశ్వరాన్ని అవునీతి ,అక్రమాలతో కూడిన ప్రాజెక్టుగా బండి అభివర్ణించారు.ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారని ఆరోపించిన కేంద్రమంత్రి, ఈ అవినీతిపై విచారణను ,రేవంత్ ప్రభుత్వం అధికారులకే పరిమితం చేయకుండా, దొంగలందరి పని పట్టాలన్నారు.
1986 నుంచి 2013 వరకూ గోదావరిలో నీటి లభ్యత 160 టీఎంసీలు వుందని సీడబ్ల్యూసీ చెబుతుంటే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు కనిపించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.కాళేశ్వరం పై క్యాబినెట్ లో ఎప్పుడు చర్చించారు?సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది?ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించారన్న అధికారిక సమాచారాన్ని రేవంత్ ప్రభుత్వం ఎందుకు బైట పెట్టడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.కాళేశ్వరం లేకున్నా ఇప్పుడు పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ నేతలు జవాబు చెప్పాలన్నారు.
Tags:    

Similar News