గాలి జనార్దన రెడ్డికి హైకోర్టు భారీ ఊరట,
సిబిఐ కోర్టు తీర్పున సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు;
కర్నాటక మైనింగ్ దిగ్గజం, ఒక నాటి బిజెపి మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనకు నేడు బెయిల్ మంజూరయింది. ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్రెడ్డి, నాటి మైనింగ్ కార్పరేషన్ ఎండి రాజగోపాల్ లకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి ఇటీవల నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షవిధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే, ఆయన రూ.10 లక్షల రెండు షూరిటీలు సమర్పించాలని దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని చెప్పింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని హైకోర్టు ఆశించింది.
సిబిఐ కోర్టు శిక్ష ఏమిటి?
అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు మే నెల ఆరోతేదీన ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 14 సంవత్సరాల దర్యాప్తు తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ఏ వన్ గా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మిగిలిన నిందితులకూ అదే జైలుశిక్ష విధించారు. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా విధించారు. సీబీఐ కోర్టు తీర్పును కొట్టివేయాలని ప్రస్తుతం చంచల్గుడా జైల్లో ఉన్నదోషులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దోషులు పిటిషన్ వేశారు.
నేరారోపణ ఏమిటి?
కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో రాష్ట్ర సరిహద్దులు చెరిపేసి అక్రమంగా ఇనుప ఖనిజం మైనింగ్ చేశారని గాలి మీద ఆరోపణలు వచ్చాయి. వీటి మీద సిబిఐ విచారణ జరిపింది. 2009-2010 మధ్య 8 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వి విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణల అనంతరం సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి. లక్ష్మినారాయణ గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి లో 2011 జనవరి 5న అరెస్టు చేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారు. 2015 జనవరి 20న సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఆయనకు బెయిలును మంజూరు చేసింది.
ఈ కేసు విచారణ ముగిశాక నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు విధించింది.
గనుల అక్రమ తవ్వకం జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కి కేసునుంచి కోర్టు విముక్తి కలిగిస్తూ నిర్దోషిగా ప్రకటించింది. అదే విధంగా అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కృపానందం ఐఏఎస్ కోర్టు నిర్దోషి అని చెప్పింది.