కల్లు కాంపౌడ్లలో ఆకస్మిక తనిఖీలు
కల్తీ మరణాలతో అప్రమత్తం;
By : B Srinivasa Chary
Update: 2025-07-12 15:43 GMT
హైద్రాబాద్ కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది.ఈ గటనలో ఇప్పటివరకు 9 మంది చనపోయిన సంగతి తెలిసిందే. మూడు టీంలతో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. మూసాపేట, కైతలాపూర్, బాలాపూర్, కాచిగూడలో తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించారు. నమూనాలను పరీక్షల నిమిత్తం లాబ్ కు పంపారు. శేర్ లింగంపల్లి సిద్దిక్ నగర్ లో అనుమతి లేకుండా కల్లు కంపౌండ్ నిర్వహిస్తున్నట్లు ఆకస్మిక వెల్లడైంది. కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు.
కల్తీ కల్లుమరణాలను అరికట్టడాాానికిరాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది.