చెన్నై విరుదునగర్‌ నుంచి సినీనటి రాధికా శరత్‌కుమార్‌

చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బరిలోకి దించిన బీజేపీ తాజాగా సినీ నటి రాధికను విరుదునగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తోంది.

Update: 2024-03-22 11:01 GMT

భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం (మార్చి 22) తమిళనాడులోని 14 స్థానాలకు, పుదుచ్చేరిలోని ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నమశ్శివాయంను కేంద్రపాలిత ప్రాంతం నుంచి పోటీకి దింపింది. ప్రముఖ సినీ నటి, దర్శకురాలు రాధికా శరత్‌కుమార్‌ విరుదునగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నారు. న్యాయవాది ఆర్‌సీ పాల్‌ కనగరాజ్‌ ఉత్తర చెన్నై నుంచి బరిలోకి దిగుతున్నారు.

కోయంబత్తూరు నుంచి తమిళనాడు చీఫ్ కె అన్నామలై, నీలగిరి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ సహా తొమ్మిది లోక్‌సభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను గురువారం (మార్చి 21) ప్రకటించింది.

మిత్రపక్షాలలో డాక్టర్ రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె)కి బీజేపీ 10 సీట్లు కేటాయించింది. చిన్న భాగస్వామ్య పక్షాలకు కొన్ని సీట్లు కేటాయించారు.

చెన్నై సౌత్ స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను, కన్యాకుమారి నుంచి కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను నామినేట్ చేసింది. తమిళనాడులో మొత్తం 38 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

Tags:    

Similar News