గెలుపుపై బీజేపీ ధీమా.. సౌత్ ఇండియాలో సత్తా చాటుతాం: షా

తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. సౌత్ ఇండియాలో మునుపటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.

Update: 2024-04-19 05:55 GMT

లోక్‌సభ ఎన్నికల వేళ..పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఈ రోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు ఇంకా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారత దేశంలో ఈ సారి కమలం పార్టీ సత్తా చాటుకుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా. గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా రోడ్ షోలో మాట్లాడుతూ ..దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తమకు 400 స్థానాలకు పైగా స్థానాలు వస్తాయని చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి సౌత్ ఇండియాలో మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో 26 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పారు.  

Tags:    

Similar News