కర్ణాటకలో బీజేపీలో భూకంపం

బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో తమ పేరు లేకపోవడంతో కర్ణాటక బీజేపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Update: 2024-03-14 14:26 GMT

కర్ణాటకలో 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. అయితే టికెట్ రాకపోవడంతో కొందరు నేతలు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. హవేరి లేదా ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ టికెట్ ఆశించారు. కాని మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన గురువారం సాయంత్రం తన నిర్ణయం చెబుతానంటూనే ..బెళగావి సీటు కోసం బీజేపీలోని సీనియర్లతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి..

2023 అసెంబ్లీ ఎన్నికలలో శెట్టర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా, కాంగ్రెస్ ఆయనను శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేసింది. అయితే యాదృచ్ఛికంగా ఆయన జనవరిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కాగా 2024 ఎన్నికల్లో షెట్టర్‌కు బీజేపీ లోక్‌సభ టిక్కెట్టు ఆఫర్ చేసిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తనను బలిపశువుగా చేశారా? అని అడిగినప్పుడు షెట్టర్.. ‘‘ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దానిపై ఏం మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు చెబుతారు. చెప్పాల్సిన వారు మాట్లాడతారు.” అని సమాధానమిచ్చారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ..‘‘బెళగావి నియోజకవర్గానికి తన పేరు ఉందని షెట్టర్ చెప్పారు. ఇది నాకు కూడా తెలుసు. ఆయన మా సీనియర్ నాయకుడు. బెలగావి లేదా మరేదైనా స్థానం నుంచి టికెట్ వస్తే నేను సంతోషిస్తాను.’’ అని అన్నారు.

నిరాశ చెందిన ఈశ్వరప్ప..

తొలి జాబితాలో పేరు లేకపోవడంతో మరో బీజేపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా నిరాశ చెందారు. ఆయన తనయుడు కేఈ కాంతేష్‌ కోసం టికెట్‌ ఆశించారు. అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన కుమారుడిని లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పించారని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. కాగా ఈశ్వరప్ప కుమారుడిని శాసనమండలి సభ్యుడిగా చేస్తామని యడియూరప్ప చెప్పినట్లు సమాచారం.

నిన్న శివమొగ్గలో విలేకరులతో ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని తనపై ఒత్తిడి ఉందన్నారు. బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ గురువారం ఈశ్వరప్పను కలిశారు.

"ఈశ్వరప్ప చాలా బాధపడ్డాడు. రేపు శివమొగ్గలో ఆయన మీటింగ్ పెట్టబోతున్నారని తెలిసింది. అందుకే ఆయన్ను కలిసేందుకు వచ్చాను' అని ఈశ్వరప్పను కలిసిన తర్వాత సదానంద గౌడ విలేకరులతో అన్నారు.

సదానంద గౌడ స్థానంలో బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయడంతో ఆయన కూడా ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు. కరంద్లాజే గురువారం దేవేగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

బీజేపీ కార్యాలయం ధ్వంసం..

కొప్పల్‌కు చెందిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ కారడి సంగన్నకు టికెట్ నిరాకరించడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు.సంగన్నను కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన కొప్పల్‌లోని పార్టీ అభ్యర్థి డాక్టర్ బసవరాజ్ కువటోర్‌ను ఈ బృందం అడ్డుకుంది.సంగన్న మద్దతుదారులు కూడా కొప్పల్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Tags:    

Similar News