ఎన్నికల బరిలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ అల్లుడు మంజునాథ్..

బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ బరిలో నిలువనుండగా బీజేపీ తరుపున మంజునాథ్ పోటీ చేసే అవకాశం ఉంది.

Update: 2024-03-13 16:36 GMT

ప్రముఖ కార్డియాక్ సర్జన్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ అల్లుడు డాక్టర్ సిఎన్ మంజునాథ్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. బెంగుళూరు రూరల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. పోటీ విషయమై చర్చించేందుకు బుధవారం సాయంత్రం బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం బీజేపీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ మరోసారి బరిలోకి దిగారు. కర్ణాటకలో బీజేపీ, జేడీ(ఎస్‌) మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. జేడీ(ఎస్) మాండ్య, హసన్, కోలార్ మూడు స్థానాల్లో పోటీ చేయవచ్చని, మంజునాథ్‌ను పోటీకి దింపేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని సమాచారం. మంజునాథ్ ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు.  

Tags:    

Similar News