2019 కంటే ఎక్కువ సీట్లొస్తాయి: కాంగ్రెస్ నేత చిదంబరం

లోక్ సభ ఎన్నికలలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాయని, తమిళనాడు, కేరళలో భారత కూటమి అఖండ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చెప్పారు.

Update: 2024-04-13 12:06 GMT

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం పేర్కొన్నారు. తమిళనాడు, కేరళలో భారత కూటమి అఖండ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"వచ్చే ఎన్నికల్లో 2019 కంటే మా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి సత్తా చాటుతుంది. దేశంలో హిందూ మతానికి, హిందువులకు ఎలాంటి ముప్పు లేకపోయిన ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ ఎన్నికల వ్యూహం. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బీజేపీని ఢీ కొట్టబోతున్నారు. రాష్ట్రంలో దీదీ మరోసారి పట్టు నిలుపుకుని ఇండియా కూటమిని బలోపేతం చేస్తుంది. కేరళలో రెండు ఫ్రంట్‌లు (యుడీఎఫ్, ఎల్‌డీఎఫ్) 20 సీట్లను గెలుచుకుంటాయి. అక్కడ బీజేపీకి ఒక్క సీటూ రాదు.

కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. చివరి సారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మేం గెలుచుకోబోయే స్థానాలపై మాకు అంచనా ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో ఇండియా కూటమి విజయఢంకా మోగిస్తుంది.

కచ్చతీవు సమస్య ముగిసిన అధ్యాయం. కచ్చతీవు సమస్య తమిళనాడు, శ్రీలంకలోని రామేశ్వరం మధ్య ఉన్న ద్వీపం చుట్టూ దశాబ్దాల నాటి ప్రాదేశిక, ఫిషింగ్ హక్కుల వివాదానికి సంబంధించినది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాషాయ పార్టీ ఆ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తోంది. 2014 నుంచి ఆయనే (మోదీ) అధికారంలో ఉన్నారు.. ఇన్నేళ్లు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు" అని చిదంబరం ప్రశ్నించారు.  

Tags:    

Similar News