టేకాఫ్ సమయంలో కూలిన విమానం..

ఖాట్మండు విమానాశ్రయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. విమానంలో 19 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Update: 2024-07-24 07:01 GMT

ఖాట్మండు ఎయిర్ పోర్టులో ఓ విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఖాట్మండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోఖారాకు బయలుదేరిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. విమానంలో సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కూలిన వెంటనే ఒక్కసారిగా చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశాయి. ప్రమాదంలో గాయపడ్డ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల పరిస్థితి, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News