బెంగళూరుకు మరో NIMHANS

300 పడకల పాలీట్రామా యూనిట్‌, పీజీ సెంటర్‌కు కేంద్రం ఆమోదం;

Update: 2025-06-28 11:02 GMT
Click the Play button to listen to article

కేంద్రం కర్ణాటకకు శుభవార్త చెప్పింది. బెంగళూరు(Bangalore)లో మరో NIMHANS (National Institute of Mental Health and Neurosciences) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంకో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఇటీవలె బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు రూరల్ ఎంపీ డాక్టర్ సిఎన్ మంజునాథ్‌ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరారు. దీంతో ఆసుపత్రికి నిర్మాణానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నుంచి అనుమతి లభించింది. రూ. 498 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇక దేవనహళ్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని క్యాలాసనహళ్లిలో నిమ్హాన్స్ పీజీ సెంటర్, 300 పడకల పాలీట్రామా సెంటర్‌‌ నిర్మించనున్నారు. కేంద్రం అనుమతి ఇవ్వడంపై ఎంపీలిద్దరూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ రహదారి, విమానాశ్రయానికి సమీపంలో కొత్త NIMHANS నిర్మాణం వల్ల ఇతర నగరాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందనుంది.

వాస్తవానికి 2012-13లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ప్రభుత్వం మరో నిమ్హాన్స్ ఏర్పాటుకు క్యాలసనహల్లిలో 39 ఎకరాలు కేటాయించింది. ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. 

Tags:    

Similar News