సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ నిఘా, 15 మంది అరెస్ట్

సోషల్ మీడియాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ నిఘా పెట్టింది.అసభ్యకరమైన వీడియోలను అప్ లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు.;

Update: 2025-06-19 15:10 GMT
నల్సార్ తో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పందం

తెలంగాణలో సోషల్ మీడియా పోస్టులపై సైబర్ సెక్యూరిటీ నిఘా వేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో చైల్డ్ పోర్న్ వీడియోలు పోస్టు చేసిన వారిని వారి ఐపీ అడ్రసుల ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్ణయించింది. చిన్న పిల్లల అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తే చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.


చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న 15 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ శిఖాగోయల్ వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా చిన్న పిల్లల పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారని తేలింది. దీంతో హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 15 మంది నిందితులకు 34 కేసుల్లో ప్రమేయం ఉందని తేలిందని శిఖా గోయల్ చెప్పారు. పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్న వారంతా 19 నుంచి 50 ఏళ్ల వయసు వారని వెల్లడైంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తమ దర్యాప్తులో వెలుగుచూసిందని చెప్పారు.

సైబర్ నేరాల నిరోధానికి నల్సార్ తో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పందం
సైబర్ నేరాల నిరోధానికి చట్టపరమైన సహకారాన్ని బలోపేతం చేయడానికి డిజిటల్ రక్షకులను నియమించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నల్సార్ (NALSAR) న్యాయ విశ్వవిద్యాలయంతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందంపై బుధవారం సంతకం చేసింది. సైబర్ సెక్యూరిటీ పనితీరులో దేశంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు జాతీయ అవార్డు లభించింది. ఇటీవల ఈ అవార్డును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి శిఖాగోయల్ అందుకున్నారు.


Tags:    

Similar News