భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దీపావళికి రోజు దర్శనం చేసుకోవడం సెంటిమెంట్
దీపావళి పర్వ దినం పురస్కరించుకుని సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. రా త్రి వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీపావళి రోజు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా వస్తోంది. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని మొక్కులు సమర్పించుకుంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వెండినాణేల కోసం
వెండినాణేల కోసం భక్తులు క్యూలై నులో గంటల తరబడి నిల్చుండిపోయారు. తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారపని ఆలయ ట్రస్టీ శంభు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. అమ్మవారి రూపు రేఖలు ఉన్న వెండి నాణేలు తీసుకోవడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించి పోయింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రతి శుక్రవారం భక్తుల సంఖ్య ఎక్కుంగా ఉంటోంది. చారిత్రాత్మక మక్కా మసీదులో బాంబు పేలుడు తర్వాత ఈ దేవాలయానికి సెక్యురిటీ పెరిగింది. అప్పటి నుంది దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిది.
గోల్కొండ నవాబుల కాలంలో
గోల్కొండ నవాబుల కాలంలో అమ్మవారు ఇక్కడ వెలిసింది అనే కథ ప్రాచుర్యంలో ఉంది. కులిఇకుతుబ్ షాహి కాలంలో చార్మినార్ వద్ద కాపాలా దా రులు ఉన్నారు. అమవాస్య రోజు చిమ్మచీకటిగా ఉంది. అమ్మవారు నడుచుకుంటూ వచ్చింది. కాపలాదారులు అడ్డుకున్నారు. రాజును అడిగి వస్తామని గోల్కొండ కోటకు గు ర్రాలపై వెళ్లారు. రాజుకు విషయం చెప్పారు. అక్కన్న మాదన్న లు మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరు అమ్మవారికి భక్తులు కావడంతో వచ్చింది ల క్మ్మి అమ్మవారు అని చెప్పారు. కాపలాదారులు వెళ్లే వరకు అమ్మవారు అక్కడే ఉంటానని మాటివ్వడంతో రాజు కాపలాదారులను వెనక్కి పోనివ్వలేదు. గోల్కొండ నవాబుల కాలంలో అమ్మ వారు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.