అంతర్జాతీయ బాటలో తెలంగాణ జాగృతి
తెలంగాణ జాగృతి వివిధ దేశాల అధ్యక్షుల నియామకం;
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు దేశాల తెలంగాణ జాగృతి శాఖలకు నూతన అధ్యక్షులను ఆదివారం ప్రకటించారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణీయుల సంక్షేమానికి కృషి చేయాలని కవిత సూచించారు.
"తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సంస్థ ‘తెలంగాణ జాగృతి. ’. అదే స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరువ కావడానికి తెలంగాణ జాగృతి కార్యక్రమాలను వివిధ రంగాలలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. పలు దేశాలలోని శాఖలతో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తున్నది,"అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ దేశాల అధ్యక్షులు, ఇతర నియామకాల వివరాలు
న్యూజిలాండ్ అధ్యక్షులు - అరుణ జ్యోతి ముద్దం
గల్ఫ్ అధ్యక్షులు : చెల్లంశెట్టి హరిప్రసాద్
ఖతర్ అధ్యక్షులు - మూకల ప్రవీణలక్ష్మి, : - అడ్వైజర్ - నందిని అబ్బగోని
యూఎఈ అధ్యక్షులు - పీచర వేంకటేశ్వర రావు, : - ప్రధాన కార్యదర్శి: శేఖర్ గౌడ్
కువైట్ అధ్యక్షులు - మర్క ప్రమోద్ కుమార్
సౌదీ అరేబియా అధ్యక్షులు - మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్
ఒమన్ అధ్యక్షులు - గుండు రాజేందర్ నేత
యునైటెడ్ కింగ్ డమ్ అధ్యక్షులు - సుమన్ రావు బల్మూరి
ఇటలీ అధ్యక్షులు - తానింకి కిశోర్ యాదవ్
ఫిన్లాండ్ - ఐరెడ్డి సందీప్ రెడ్డి
పోర్చుగల్ - ప్రకాశ్ పొన్నకంటి
మాల్టా అధ్యక్షులు - పింటు ఘోష్
కెన్యా అధ్యక్షులు - స్వప్న రెడ్డి గంట్ల
ఇరాక్ & కుర్దిస్తాన్ - అధ్యక్షులు: మహ్మద్ సల్మాన్ ఖాన్- ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్
అలాగే మహారాష్ట్ర శాఖ అధ్యక్షులుగా శ్రీనివాస్ సుల్గే ను నియమించారు.
ఈ నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి,ప్రధాన కార్యదర్శి, రంగు నవీన్ ఆచారి ప్రకటనలో పేర్కొన్నారు.