తెలంగాణ కొత్త మంత్రుల శాఖలివే

వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌లు కొత్త మంత్రులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.;

Update: 2025-06-11 16:42 GMT

తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగినప్పటి నుంచి ఎవరికి ఏ శాఖ వస్తుందనే అంశం చర్చల్లో నిలుస్తోంది. మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ తొలివిడతగా ముగ్గురు కొత్త మంత్రులను ప్రభుత్వం ప్రకటించింది. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌లు కొత్త మంత్రులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కాగా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వీరికి కేటాయించే శాఖలను ప్రకటించింది ప్రభుత్వం.

 

అడ్లూరి లక్ష్మణ్‌: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖలు, గడ్డం వివేక్‌: కార్మిక, మైనింగ్‌, వాకిటి శ్రీహరి: క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags:    

Similar News