పాశమైలారంలో ఉద్రిక్తత...పోలీసులపై రాళ్లు
తమవాళ్లు ఎక్కడ అని కుటుంబ సభ్యుల ఆందోళన;
పటాన్ చెరు పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 14 మంది చనిపోయారని అధికారులు ప్రకటించినప్పటికీ చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు అంత స్థుల భవనం కూలి ఎంతమంది చనిపోయింది అనే విషయం ఇంకా తేలలేదు. మూడంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో మొత్తం 90 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 14 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. తమ వాళ్లు ఎక్కడ ఉన్నారని కుటుంబ సభ్యులు సిగాచీ ఫ్యాక్టరీకి చేరుకుంటున్నారు. ఆస్పత్రుల్లో కూడా తమవారు లేకపోవడంతో తమ వాళ్లు చనిపోయారా అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాక్టరీలో అనుమతించాలని కోరుతున్నారు. పోలీసులు వారించడంతో కుటుంబ సభ్యులకు పోలీసుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఒకదశలో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
తమ వాళ్లను అప్పగించాలని వైద్యం మేం చేయించుకుంటాం అని ఆందోళనకాదులు కోరుతున్నారు. బీహార్ కుచెందిన కార్మికులు ఎక్కువ సంఖ్యలో సిగచీ కంపెనీలోపని చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఫ్యాక్టరీలో పని చేస్తున్న తమ వాళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటారని ఊహించలేపోయాం అని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. క్షత గాత్రులు ఇంకా భవనం శిధిలా ల క్రింద ఉన్నట్లు తెలుస్తోంది.