పటాన్ చెరు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
మరో 10 మంది పరిస్థితి ఆందోళనకరం;
పటానుచెరు పారిశ్రామిక వాడలోరియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్యగా క్రమంగా పెరుగుతోంది. షిప్ట్ లో 150 మందికి పైగా పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 10 కి చేరుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది కార్మికులు మరణించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.మరొక సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 14 చేరుకుంది. సుమారు 32 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
పారిశ్రామిక వాడ పాశ మైలారంలో సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కంపెనీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్, మానుఫ్యాక్చర్ యూనిట్లలోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి.
పేలుడు సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ క్షత గాత్రులు పడిపోయారు. ప్రాణాపాయ స్థితిలోఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంగారెడ్డి కలెక్టర్ , ఎస్ పి ప్రమాద స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి
పాశమైలారం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిపై ఆరా తీశారు. 10 మంది కార్మికులు చనిపోవడంతో రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకుమెరుగైన వైద్య సాయం చేయాలన్నారు. మొత్తం 8 ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పటిరకు 10 మంది చనిపోయారు. మరో 10 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శిథిలాల తొలగింపుకు క్రేన్లు, కట్టర్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. హైడ్రా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమయ్యారు.
పాశ మైలారంకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారని అన్నారు.
ప్రధాని దిగ్బ్రాంతి
తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— PMO India (@PMOIndia) June 30, 2025
మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు,…
ఇది మూడో ఘటన
పాశ మైలారంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలె జరిగిన ప్రమాదాల్లో ఇది మూడో ఘటన. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించింది. చనిపోయిన వారికి కోటి రూపాయలు, గాయాలపాలైన వారికి 50 లక్షలు ఇవ్వాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.