టీఎన్: మా మధ్య చర్చలు ‘‘డ్రా’’ గా ముగిశాయి: పీఎంకే నాయకుడు రామదాస్
కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించే ప్రయత్నం చేయబోనని ప్రకటించిన పీఎంకే చీఫ్;
By : The Federal
Update: 2025-06-12 13:51 GMT
మహాలింగం పొన్నుస్వామి
పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ మరోసారి తన కుమారుడు అన్బుమణి రామదాస్ పై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అన్భుమణి పార్టీని మోసం చేసి, నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తాజా విమర్శలు తండ్రి కొడుకుల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తుంది.
విల్లుపురం జిల్లాలోని తైలపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్భుమణి ఘర్షణకు సవాల్ విసురుతున్నారని, తన కొడుకు ప్రవర్తనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చల్లో ప్రతిష్టంభన..
అన్బుమణితో రాజీ పడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని డాక్టర్ రామదాస్ విలేకరుల సమావేశంలో అంగీకరించారు. తమ పరిస్థితిని టెస్ట్ క్రికెట్ లో జరిగే ‘డ్రా’తో పోల్చారు.
‘‘మేము మాట్లాడుకున్నాము. నేను వారి ప్రదేశానికి వెళ్లాను. కానీ చివరకు చర్చలు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పుడు ఇక ఇద్దరమే.. నేను లేదా అతను’’ అని రామదాస్ ప్రకటించారు.
తాను స్థాపించిన పార్టీ నుంచి అన్భుమణి తననే వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘అన్బుమణి నా గొంతు పట్టుకుని బయటకు బయటకు తోసేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
పార్టీని స్వాధీనం చేసుకోవడానికి నేను ఏమైనా మూర్ఖుడినా? నేను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్దంగా ఉన్నాను. కానీ పార్టీ నుంచి తొలగించేందుకు అంగీకరించడానికి నేనేమీ మూర్ఖుడిని కాను’’ అని రామ్ దాస్ మండిపడ్డారు.
బతికి ఉన్న శవం..
పీఎంకేను నియంత్రించాలనే అన్భుమణి ఆశయం ఆరు లేదా ఏడు సంవత్సరాల నాటిదని రామదాస్ అన్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో ఒక ఘటన గురించి ఆయన చెప్పారు.
తాను లేని సమయంలో పార్టీని నిర్వహించడానికి అన్బుమణి ముందుకొచ్చారని ఆరోపించారు. ‘‘అన్బుమణి నా గుండెల్లో పొడిచారు. నన్ను సజీవ శవంగా మార్చి ఈ మార్గంలో నడవమని బలవంతం చేశారు.
బహిష్కరణకు గురైనప్పటికీ రాముడి ముఖాన్ని వికసించే కమలం అని రామాయణం సంగతిని ఉదహరించారు.’’
టగ్ ఆఫ్ వార్..
అలాగే రామదాస్ 2026 ఎన్నికల వరకూ నేను పీఎంకే అధ్యక్షుడిగా ఉండబోతున్నానని ప్రకటించారు. తాను స్థాపించిన పార్టీకి నాయకత్వం వహించే హక్కును సమర్థించుకోవాల్సి రావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు నాయకత్వం వహించే హక్కు నాకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఇలా బహిరంగంగా అడగడం తనకు తీవ్ర అవమానంగా ఉందని అన్నారు.
తన ఇష్టానికి వ్యతిరేకంగా 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి అన్భుమణి పోటీ చేశారని ఆయన ఆరోపించారు.
అన్బుమణిని బహిష్కరించను..
అన్భుమణిపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఆయనను పీఎంకే పార్టీ నుంచి తొలగించే ప్రసక్తే లేదని రామదాస్ తేల్చి చెప్పారు. ‘‘నేను అన్బుమణిని పార్టీ నుంచి ఎప్పటికి బహిష్కరించను’’ అని ఆయన ప్రకటించారు. ఇది నాయకత్వ పోరాటం కొనసాగుతున్నప్పటికీ సంబంధాలను పూర్తిగా తెంచుకునే ఉద్దేశం ఆయన లేదని చూపిస్తోంది.
నాయకత్వ విధానానికి సంబంధించిన ఎటువంటి సమాచారం భారత ఎన్నికల సంఘానికి తెలియజేయబడలేదని రామదాస్ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతానికి నేను ఎన్నికల సంఘతో ఎటువంటి వివరాలను పంచుకోలేదు.’’ అని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వ నిర్మాణాన్ని మార్చడానికి అధికార చర్య తీసుకుంటారనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు.
పీఎంకేపై తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం తనకు మాత్రమే ఉందని రామదాస్ చెప్పారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి, పీఎంకేతో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి ఉన్ పార్టీలకు సంప్రదింపుల అంశం తనకు బాగా తెలుసని రామదాస్ చెప్పుకొచ్చారు.