హైదరాబాద్ హెల్త్ టూరిజం పై అందాల భామల ఆసక్తి
72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు శుక్రవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. రోగులను పరామర్శించారు.;
హైదరాబాద్ నగరంలో వైద్యపర్యాటక రంగం విశిష్ఠత గురించి ప్రపంచం దృష్టికి వెళ్లింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ అందాల భామలు శుక్రవారం ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి రోగులను కలిశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వైద్య పర్యాటక కార్యక్రమంలో మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫ్రికా గ్రూప్ నుంచి 25 మంది పోటీదారులు, గ్వాడెలూప్, టర్కీ, వేల్స్, బోస్నియా, ప్యూర్టో రికో, బెల్జియం, గ్వాటెమాల, లెబనాన్, మలేషియా, పోలాండ్, ఫ్రాన్స్, ఉత్తర ఐర్లాండ్, గయానా, మాల్టా వంటి ఇతర సమూహాల నుంచి వైద్యులు, మనస్తత్వవేత్తలైన అందాలభామలు పాల్గొన్నారు వీరికి సాంప్రదాయ దుస్తులు ధరించిన తెలంగాణ యువతులు గులాబీ రేకులను చల్లుతూ, ప్రత్యక్ష షెహనాయ్ ప్రదర్శనతో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
రోగులకు అందాలభామల బహుమతులు
అందాలభామలకు సత్కారం
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైద్య పర్యాటకం
మిస్ వరల్డ్ పోటీదారుల రాకతో హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణపై అంతర్జాతీయ దృష్టి ఏర్పడుతుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ చెప్పారు. హైదరాబాద్ వైద్య పర్యాటక రంగం వృద్ధి సాధించింది, గత దశాబ్దంలో విదేశీ రోగుల రాకపోకలు రెట్టింపు అయ్యాయి. 2014వ సంవత్సరంలో కేవలం 75,000 మంది విదేశీ రోగులు ఉండగా, 2024లో తెలంగాణ 1.55 లక్షల మంది అంతర్జాతీయ వైద్య పర్యాటకులను ఆకర్షించింది. దేశీయంగా గత ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి 8.82 కోట్ల మంది రోగులు తెలంగాణలో వైద్య చికిత్సలు పొందారు.