గిరిజన మహిళపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్

దేశ మ‌హిళ‌ల‌కు ప్రియాంకా గాంధీ ఇదే గౌర‌వం కోరుకుంటున్నారా..?;

Update: 2025-06-21 10:19 GMT

బూర్గంపాడు మండలంలో ఓ గిరిజన మహిళపై అటవీ శాఖ అధికారులు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మండలం పరిధిలోని ఇరువైండి బీట్ కొనసాగింపు గ్రామంలోని పోడు భూముల్లో జేసీబీలతో కందకాలు తీయించడానికి అటవీశాఖ అధికారులు వెళ్లారు. వారిని గిరిజన మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కొందరు గిరిజన మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వస్త్రాలు కూడా చినిగాయి. దీనిపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రజలంతా అటవీశాఖ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. మహిళల పట్ల అంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం చేతకాని తనానికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. సీఎంగా అలాంటి వ్య‌క్తి ఉంటే రాజ్యాంగం ఎక్క‌డ అమ‌ల‌వుతుంది..? దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా..? దేశ మ‌హిళ‌ల‌కు ప్రియాంకా గాంధీ ఇదే గౌర‌వం కోరుకుంటున్నారా..? మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే మాట్లాడుతున్న స‌మాన‌త్వం ఇదేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: కవిత

గిరిజన అడబిడ్డలపై పైశాచికత్వం.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కవిత ప్రశ్నించారు. ‘‘30 ఏళ్లుగా తమ జీవనాధారమైన పోడు భూములను సర్కారు వెనక్కి తీసుకోవడానికి ఇంతటి దుర్మార్గానికి తెగపడటం దారుణం. లగచర్లలో లంబాడీ అడబిడ్డలపై పోలీసుల అఘాయిత్యాన్ని మరవకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలో గిరిజన మహిళల దుస్తులు చింపేసి ఫారెస్ట్ అధికారులు దాడులకు తెగపడటం అమానవీయం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News