కన్నీళ్ళు పెట్టుకున్న కేసీఆర్

ఎప్పుడూ గంభీరంగా కేనిపించే కేసీఆర్(KCR Tears) భావోద్వేగానికి గురై ఏడుస్తారని ఎవరూ ఊహించలేదు;

Update: 2025-06-08 08:14 GMT
KCR with tears

ఊహించని సన్నివేశం ఎదురైంది. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాధ్ కు నివాళులు అర్పించేందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. గోపీనాధ్(maganti Gopinath) కొడుకును దగ్గరకు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేశారు. ఎప్పుడూ గంభీరంగా కేనిపించే కేసీఆర్(KCR Tears) భావోద్వేగానికి గురై ఏడుస్తారని ఎవరూ ఊహించలేదు. తమఅధినేత కంటకన్నీరు చూసి నేతల నోట మాట రాలేదు. భావోద్వేగాల సన్నివేశం కారణంగా అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న గోపి మరణంతో పార్టీ నేతలకు షాక్ కొట్టినట్లయ్యింది.

పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో గోపీకి మంచి సన్నిహితముంది. గోపి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకుని అమెరికాలో ఉన్న కేటీఆర్ వెంటనే హైదరాబాదు చేరుకున్నారు. దీంతోనే కేసీఆర్, కేటీఆర్ తో గోపీకి ఉన్న సన్నిహితం ఏమిటో అర్ధమైపోతోంది. కేటీఆర్ హైదరాబాదుకు చేరుకోగానే నేరుగా ఆసుపత్రికే వెళ్ళారు. ఈరోజు ఉదయం నుండి కేటీఆర్, హరీష్ తదితరులు ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. గోపీ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అధినేత కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. గోపీ మృతదేహానికి నివాళులు అర్పించేసమయంలో ఒక్కసారిగా ఏడ్చేశారు. గోపి కొడుకును దగ్గరకు తీసుకుని ఓదారుస్తు కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. గోపితో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకునేందుకు తాను ఉన్నాను అంటు కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News