ఎస్‌ఎల్‌బీసీలో లభించిన మృతదేహం

మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.;

Update: 2025-03-09 13:54 GMT

ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో చేపట్టిన సహాయక చర్యల్లో కీలక పురోగతి వచ్చింది. తొలి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం ఒక మృతదేహం కుడిచేయి కనిపించడంతో అక్కడ తవ్వకాలు చేసి సాయంత్రానికి ఒక మృతదేహాన్ని విజయవంతంగా బయటకు తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News