పాశ మైలారం ఘటనలో రియాక్టర్ పేలుడు వల్ల జరిగిందని వస్తున్న వార్తలను మంత్రి దామోదర రాజనరసింహా కొట్టివేశారు. ఈ ఘటనను కొందరు రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని అన్నారు ఎయిర్ డ్రయ్యర్ లీకేజివల్ల ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.
కమిటీ వేస్తాం
ప్రమాదాలను నివారించడానికి కమిటీ వేస్తామని మంత్రి దామోదరం చెప్పారు. పారిశ్రామిక వాడల్లో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి కమిటీ పని చేయనుందని మంత్రి తెలిపారు. ఎయిర్ డ్రయ్యర్ లీకేజిని కనిపెట్టడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి చెప్పారు. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.